పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ విసిరిన హనీట్రాప్ లో ఎన్ఐఏ కీలక ముందడుగు వేసింది. ఈ కేసులో ప్రధాన కుట్రదారుగా బావిస్తున్న అగంతకుడిని అదుపులోకి తీసుకుంది. ఈ కేసుకు సంబంధించి నౌకదళ రహస్యాలను చేరవేసిన ఏడుగురు నేవీ సిబ్బందిని గతేడాది డిసెంబరులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ‘ఆపరేషన్ డాల్ఫిన్ నోస్’ దర్యాప్తులో భాగంగా ముంబైలో మొహమ్మద్ హరూన్ హజీ అబ్దుల్ రెహమాన్ లక్డావాలా(49) అనే వ్యక్తిని ఎన్ఐఏ శుక్రవారం అరెస్ట్ చేసింది. ఆపరేషన్ డాల్ఫిన్ నోస్లో ఇతడికి కీలక సూత్రధారిగా ఎన్ఐఏ నమ్ముతోంది. లక్డావాలా అరెస్ట్తో ఈ కేసులు అదుపులోకి తీసుకున్న నిందితుల సంఖ్య 14కి చేరింది.
‘సరిహద్దు వాణిజ్యం ముసుగులో అతడు కరాచీకి ఎన్నిసార్లు ప్రయాణించాడో పరిశీలిస్తే లక్డావాలా అరెస్ట్ చాలా ముఖ్యమైంది.. అక్కడ అక్బర్ అలియాస్ అలీ, రిజ్వాన్ అని పిలువబడే పాకిస్తాన్ గూఢచారులను కలిశాడు’ అని ఎన్ఐఏ మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ మొత్తం కేసులో లక్డావాలా పాత్ర చాలా కీలమైందని, నేవీ ఉద్యోగుల బ్యాంకు ఖాతాలకు వివిధ మార్గాల్ ద్వారా నగదు జమచేయడంలోనూ కీలకంగా వ్యవహరించినట్టు పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి తెలిపారు. ఈ రాకెట్ 2018లో ప్రారంభమైందని, 2019 డిసెంబరులో నిందితులను అరెస్ట్ చేశారు.
భారత నౌకాదళానికి చెందిన సబ్మెరైన్లు, యుద్ధనౌకల మొహరింపు సమాచారాన్ని పాక్కు చేరవేసినట్టు గత ఏడాది డిసెంబరు 20న ఏపీ నిఘా విభాగం బయటపెట్టింది. దీనికి ‘ఆపరేషన్ డాల్ఫిన్ నోస్’ అని నామకరణం చేసి దర్యాప్తు చేపట్టారు. మొత్తం ఈ కేసులో ఇప్పటివరకు 14 మంది అరెస్టు కాగా.. వారిలో పాకిస్థాన్లో జన్మించిన షాయిస్తా క్వయిజర్ అనే యువతి కూడా ఉంది. తొలుత ఏడుగురు నేవీ ఉద్యోగులును అదుపులోకి తీసుకోగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో మరో ముగ్గుర్ని అరెస్ట్ చేశారు.
ఫేస్బుక్, వాట్సాప్, ఆన్లైన్ డేటింగ్ సైట్స్ ద్వారా నేవీ ఉద్యోగులను పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ హానీట్రాప్ ద్వారా ఉచ్చులోకి లాగి నౌకా స్థావరాలు, జలంతార్గములు, యుద్ధ నౌకలకు సంబంధించిన రహస్యాలను పొందినట్టు తెలుస్తోంది. ఆన్ లైన్ డేటింగ్ సైట్స్లో మహిళలను ఐఎస్ఐ ఎరగావేసి నేవీ సిబ్బంది ఆకర్షించింది. తరువాత సమాచారం సేకరించడానికి బ్లాక్మెయిల్కు పాల్పడ్డారు. ఒకవేళ సమాచారాన్ని ఇవ్వకపోతే మహిళలతో చాట్లను బహిర్గతం చేస్తామని బెదిరించినట్టు ఎన్ఐఏ గుర్తించింది. ఈ విధంగా నౌకా స్థావరాలు, కదలికల గురించి సమాచారాన్ని సేకరించారని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. లక్డావాలా ఇంటిలో అనేక ఆధారాలు లభించాయని, వాటిని స్వాధీనం చేసుకున్నామని ఎన్ఐఏ వివరించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more