ప్రపంచ దేశాలను తీవ్ర కలవరానికి గురిచేస్తున్న కరోనా వైరస్ నెమ్మదిగా భారత దేశంపై కూడా తన పంజా విసురుతోంది. దేశంలో మహరాష్ట్రలో అధ్యధిక కరోనా కేసులు నమోదు కాగా ఆ తరువాత ఈ జాబితాలో కేరళా రాష్ట్రం వుంది. ఇక ఇటు తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. రోజురోజుకు కరోనా కేసులు పెరిపోతుండడంతో భయాందోళనలు మొదలయ్యాయి. ఇవాళ తాజాగా అందిన గణాంకాల ప్రకారం దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 271కి చేరిందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ప్రకటన చేసింది.
కరోనా కారణంగా ఇప్పటివరకు దేశంలో మొత్తం నలుగురు మృతి చెందారని ఈ రోజు ఉదయం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. ఢిల్లీ, కర్ణాటక, పంజాబ్, మహారాష్ట్రల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారని వివరించింది. కరోనా పాజిటివ్ అని తేలిన వారిలో 39 మంది విదేశీయులని తెలిపింది. కరోనా పాజిటివ్ అని తేలిన వారితో గతంలో కలిసున్న వారికి పరీక్షలు నిర్వహించాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సూచించింది. కాగా, కరోనా వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా రేపు జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని మోదీ సూచించిన విషయం తెలిసిందే.
ఇప్పటివరకు తెలంగాణలో ఆరు కేసులు పాజిటివ్ అని తేలగా.. నిన్న ఒక్కరోజే కేసులు డబుల్ అయ్యాయి. కాగా, తాజాగా మరో రెండు కేసులు పాజిటివ్ గా నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 21కి చేరింది. వీరితో ఒకరు 35ఏళ్ల యువకుడు. విదేశాల నుంచి వ్యక్తితో కలిసిన నేపథ్యంలో ఆయనకు ఈ వైరస్ సోకింది. ఇక మరో వ్యక్తి కూడా 33 ఏళ్ల యువకుడు కావడం గమనార్హం. అమెరికాలోని క్రూజ్ లో పనిచేస్తున్న సదరు యువకుడు దుబాయ్ మీదుగా హైదరాబాద్ కు చేరుకోగానే అతడ్ని అదుపులోకి తీసుకున్న సిబ్బంది క్వారంటైన్ కు తరలించి పరీక్షలు నిర్వహించగా, నివేదికలు ఆయనకు కరోనా సోకిందని నిర్థారణ అయ్యింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more