కరోనా వైరస్ విషయంలో అత్యంత నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించి పార్లమెంటు సభ్యులకే వైరన్ ను అంటించిందన్న ఆరోపణతో బాలీవుడ్ సింగర్ కనికా కపూర్పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పదిరోజల క్రితం లండన్ నుంచి భారత్కు తిరిగొచ్చిన కనికా కనీస జాగ్రత్తలు పాటించకుండా మార్చి 13-15 తేదీల్లో లక్నోలో పలు ఈవెంట్లు నిర్వహించి సెలబ్రిటీలను ఎందరినో ఆహ్వానించినారు. తర్వాత ఆమె కరోనా వైరస్ పాజిటివ్గా తేలడంతో ఆమె ఈవెంట్లకు హాజరైన సెలబ్రిటీలు, పార్లమెంటు సభ్యులు కూడా వణికిపోతున్నారు. దీంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు కనికాపై మొత్తం నాలుగు కేసులు నమోదు చేశారు.
బాలీవుడ్ గాయని కనికాకపూర్ నిర్లక్ష్యంతో కరోనా భయాందోళనలు తాజాగా పార్లమెంటు దాకా పాకాయి. కనికా కపూర్ తనకు కోవిడ్-19 (కరోనా) పాజిటివ్ అని తేలిందని, దీంతో తన కుటుంబం మొత్తం సెల్ఫ్ క్వారంటైన్ లోకి పోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీంతో కరోనా తుట్టె కదిలింది. పలువురు ఎంపీలు సహా, కనికాతో కలిసిన, సన్నిహితంగా మెలిగిన వారంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనికాకపూర్ ఏర్పాటు చేసిన పార్టీకి రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, ఆమె కుమారుడు బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్ కూడా హాజరయ్యారు. దీంతో వారు హోం క్వారంటైన్ విధించుకున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
ఈ నేపథ్యంలో కనికా కపూర్ పై తీవ్రఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాలన్న డిమాండ్లు ఊపందుకోవడంతో అమెపై నాలుగు కేసులు నమోదు చేశారు ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు. నాలుగు రోజుల క్రితం మాత్రమే నాలో ఫ్లూ లక్షణాలు బయటపడ్డాయని కనిక ఒక ప్రకటనలో తెలిపారు. నాకు సాధారణ ఫ్లూ మాత్రమే వచ్చిందని భావిస్తున్నాను. కానీ ఈ సమయంలో మనం విచక్షణకల పౌరులుగా మెలగాల్సి ఉందని, నిపుణులు, మన స్థానిక, కేంద్ర ప్రభుత్వాల ఆదేశాలను పాటించడం ద్వారా మాత్రమే మనం ఈ కరోనా భీతినుంచి బయటపడగలమని కరోనా సుద్దులు పలకడం నెటిజన్లను ఇంకా మండిస్తోంది
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more