దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచారం కేసులో దోషులకు శిక్ష ఎప్పుడు అమలువుతుందా.? అన్న ఉత్కంఠకు ఈ నెల 5న క్లారిటీ వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో దోషులకు వారం రోజుల సమయాన్ని ఇచ్చిన న్యాయస్థానం వారిని అన్ని న్యాయపరమైన హక్కులను వినియోగించుకోవాలని, న్యాయబద్దంగా వున్న అవకాశాలను వాడుకోవాలని సమయాన్ని కేటాయించింది. వారం రోజుల తరువాత తీహార్ జైలు అధికారులు తమ శిక్ష అమలు ప్రక్రియ అనుసారం వ్యవహరించాలని అదేశించిన విషయం తెలిసిందే.
కాగా నిర్భయ దోషులకు ఉరిశిక్ష అములుపర్చేందుకు కొత్త తేదీని కేటాయించాలని కోరుతూ మరోసారి తీహార్ జైలు అధికారులు ఢిల్లీలోని పటియాలా హౌజ్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. నిర్భయ కేసులో దోషులు వరుసగా పిటిషన్లు దాఖలు చేస్తూ ఉరితీత అమలును జాప్యం చేస్తున్న నేపథ్యంలో వారిపై డెత్ వారెంట్లు ఇప్పటికి రెండు పర్యాయాలు వాయిదా పడ్డాయి. తొలుత జనవరి 22న ఉరితీయాలనుకున్నా, అప్పటికి దోషుల పిటిషన్లతో సాధ్యం కాలేదు. ఆ తర్వాత ఫిబ్రవరి 1న ఉరికి సర్వం సిద్ధమైనా చివరి నిమిషంలో అదీ వాయిదాపడింది.
కాగా తీహార్ జైలు అధికారులు దాఖలు చేసిన పిటీషన్ ను ఢిల్లీలోని పటియాల న్యాయస్థానం తిరస్కరించింది. కాగా ఈ సందర్బంగా సంచలన వ్యాఖ్యలు చేసింది. నిర్భయ కేసులోని దోషలు జీవించడానికి చట్టం అనుమతిస్తున్నప్పుడు.. వారిని ఉరి తీయాలని అనుకోవడం నేరపూరతిమైన పాపం అవుతుందని పేర్కోంది. ఇక ఈ కేసులోని దోషులకు వేర్వేరుగా ఉరి శిక్షను అమలుపర్చాలని కేంద్రం వేసిన పిటషన్ ను సర్వోన్నత న్యాయస్థానం ఈ నెల 11న విచారిస్తామని స్పష్టం చేసింది. ఈ పిటీషన్ ను విచారించేందుకు న్యాయస్థానం ఇవాళ పరిశీలించింది.
ఈ సందర్భంగా కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ దేశసహనాన్ని పరీక్షించింది చాలు.. ఇక వారిని ఉరి తీసేందుకు అనుమతించాలని కోరారు. ఈ పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.భానుమతి నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం పరిశీలిస్తున్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యాలు చేశారు. నలుగురు దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా ఐదు సంవత్సరాలుగా క్షమాభిక్ష పిటిషన్ వేయకుండా ఉన్నాడని ఆయన ఆరోపించారు. కేంద్రం వేసిన పిటిషన్కు సంబంధించి నిర్భయ దోషులకు నోటీసులు జారీ చేయాలని మెహతా కోరగా అందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more