అమరావతిలోనే పూర్తిస్థాయి రాజధానిని ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత రైతులు గత రెండు నెలలుగా నిరసన కార్యక్రమాలను చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేందుకు పరోక్షంగా దోహదపడిన విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామికి కూడా అమరావతి సెగ తగిలింది. గుంటూరు శివార్లలోని గోరంట్లలో శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న ఉత్సవాలకు స్వరూపానంద స్వామి ముఖ్య అతిథిగా హాజరై తిరిగి వెళ్తున్న సమయంలో ఆయన వాహనాన్ని తెలుగు మహిళా కార్యకర్తలు అడ్డుకున్నారు.
ఆయన కాన్వాయ్ ను చుట్టముట్టిన తెలుగు మహిళలు కొంతసేపు వాహనాన్ని ఎటూ కదలనీయకుండా ఘెరావ్ చేశారు. ఈ సందర్బంగా కొందరు మహిళలు ఆయనకు అమరావతిలోని పరిస్థితిని వివరించారు. రాజధాని అమరావతి కోసం రైతులు, మహిళలు ఆందోళనలు చేస్తున్నారని ఆయనకు వివరించారు. పలువురు రైతులు ఇప్పటికే రాజధాని తరలివెళ్తోందని అందోళనకు గురై మనస్థాపంతో అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మరణించారని వివరించారు. యాగాలు చేసి జగన్ ను గెలిపించినట్లే.. అమరావతిలోనే రాజధాని కొనసాగించేలా ఏదైనా యాగం చేయాలని కోరారు.
తెలుగు మహిళలు తన వాహనాన్ని ఘెరావ్ చేయడంతో పరాభవానికి లోనైన స్వరూపానంద స్వామి.. వారి మాటలకు సమాధానం ఇవ్వకుండానే స్వరూపానంద అక్కడి నుంచి ముందుకెళ్లారు. దీంతో మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్లో అమరావతి కోసం పూజలు చేసిన స్వామి.. ఇప్పుడు రాజధాని మారుస్తున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ విషయమై అడిగేందుకు వస్తే పోలీసులు నెట్టివేశారని, స్వరూపానంద కూడా తమను పట్టించుకోకుండా వెళ్లిపోయారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more