అమరావతిలోనే పూర్తిస్థాయి రాజధానిని ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత రైతులు గత రెండు నెలలుగా నిరసన కార్యక్రమాలను చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేందుకు పరోక్షంగా దోహదపడిన విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామికి కూడా అమరావతి సెగ తగిలింది. గుంటూరు శివార్లలోని గోరంట్లలో శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న ఉత్సవాలకు స్వరూపానంద స్వామి ముఖ్య అతిథిగా హాజరై తిరిగి వెళ్తున్న సమయంలో ఆయన వాహనాన్ని తెలుగు మహిళా కార్యకర్తలు అడ్డుకున్నారు.
ఆయన కాన్వాయ్ ను చుట్టముట్టిన తెలుగు మహిళలు కొంతసేపు వాహనాన్ని ఎటూ కదలనీయకుండా ఘెరావ్ చేశారు. ఈ సందర్బంగా కొందరు మహిళలు ఆయనకు అమరావతిలోని పరిస్థితిని వివరించారు. రాజధాని అమరావతి కోసం రైతులు, మహిళలు ఆందోళనలు చేస్తున్నారని ఆయనకు వివరించారు. పలువురు రైతులు ఇప్పటికే రాజధాని తరలివెళ్తోందని అందోళనకు గురై మనస్థాపంతో అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మరణించారని వివరించారు. యాగాలు చేసి జగన్ ను గెలిపించినట్లే.. అమరావతిలోనే రాజధాని కొనసాగించేలా ఏదైనా యాగం చేయాలని కోరారు.
తెలుగు మహిళలు తన వాహనాన్ని ఘెరావ్ చేయడంతో పరాభవానికి లోనైన స్వరూపానంద స్వామి.. వారి మాటలకు సమాధానం ఇవ్వకుండానే స్వరూపానంద అక్కడి నుంచి ముందుకెళ్లారు. దీంతో మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్లో అమరావతి కోసం పూజలు చేసిన స్వామి.. ఇప్పుడు రాజధాని మారుస్తున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ విషయమై అడిగేందుకు వస్తే పోలీసులు నెట్టివేశారని, స్వరూపానంద కూడా తమను పట్టించుకోకుండా వెళ్లిపోయారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more