పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జామియా విశ్వవిద్యాలయం ఆవరణలోని విద్యార్థులు గత కొన్ని రోజులుగా అందోళనలు చేపట్టడుతుండగా.. వారిని సమీపించి గాల్లోకి కాల్పులు జరిపిన కపిల్ గుజ్జర్ చుట్టూ రాజకీయ వివాదం అలుముకుంటోంది. అతడ్ని అరెస్టు చేసిన పోలీసులు అదుపులోకి తీసుకున్న తరుణంలో అతను అమ్ అద్మీ పార్టీ కార్యకర్త అంటూ చెప్పడంతో సీఏఏను వినియోగించుకుని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో అప్ పార్టీ లబ్దిపోందడానికి పరోక్షంగా బీజేపి పార్టీపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని విమర్శలు వచ్చాయి.
కపిల్ గుజ్జార్ ఆప్ సభ్యుడని అంగీకరించినట్టు కూడా పోలీసులు వెల్లడించారు. దీనికి సంబంధించి ఫొటోలు కూడా పోలీసులు విడుదల చేశారు. ఈ ఫొటోలన్నీ గుజ్జర్ ఫోన్ లో ఉన్నాయని, అందులో అతడు ఆప్ టోపీ ధరించి ఉన్నాడని, పక్కనే ఆప్ నేతలు సంజయ్ సింగ్, అతిషి కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో నష్టనివారణ చర్యలకు దిగిన అప్ పార్టీ.. ఎలాంటి దర్యాప్తు, విచారణ లేకుండా ఓ నిందితుడ్ని తమ పార్టీ సభ్యుడని ఎలా నిర్థారిస్తారంటూ ప్రశ్నించింది. కట్టుకధలను అల్లి.. తమ పార్టీపై బురదజల్లి.. నష్టం కలిగేలా వివరాలను వెల్లడించిన డీఎస్సీపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి పిర్యాదు చేసింది.
తాజాగా మరో అంశం వెలుగులోకి వచ్చింది. కపిల్ గుజ్జర్ తండ్రి రంగంలోకి దిగి.. తన కుమారుడు ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రి అమిత్ షా మద్దతుదారుడని వెల్లడించారు. తనకు తన కుమారుడికి రాజకీయంగా ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు. అయితే తమకు ఢిల్లీ అధికార పార్టీ ఆఫ్ తో ఎలాంటి సంబంధం లేదని కొట్టిపారేశారు. ‘నేను కానీ లేదా నా కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరికి ఆప్ తో సంబంధం లేదు. గత ఏడాదిలో లోక్ సభ ఎన్నికల ప్రచార సమయంలో అక్కడ అందరితో పాటు కపిల్ కూడా టోపీ ధరించాడు అంతే’ అంటూ గాజే సింగ్ వివరణ ఇచ్చారు.
ఆ తరువాత మరికొన్ని గంటల తరువాత మళ్లీ మీడియా ముందుకు వచ్చిన ఆయన.. ‘నా కుమారుడు మోడీ సపోర్టర్. మోడీ, అమిత్ షా అనుచరుడు కూడా’అని అన్నాడు. తన కుమారుడికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు. షాహీన్ బగ్ మీదుగా రోడ్లన్నీ బ్లాక్ చేయడంతో కపిల్ ఇబ్బంది పడ్డాడని, గంటలో వెళ్లాల్సిన పనికి నాలుగు గంటలు ఆలస్యమైందని అన్నాడు. అంతేకాదు.. తన కుమారుడు జాతీయభావాలు కలిగిన వ్యక్తి అని, ఎప్పుడూ హిందుస్థాన్, హిందుత్వాన్ని గురించి గొప్పగా మాట్లాడుతుంటాడని తెలిపాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more