దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచారం కేసులో దోషులకు శిక్ష ఎప్పుడు విధిస్తారోనని యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న వేళ.. వరస వాయిదాలకు క్రితం రోజు స్వస్తి పలికిన ఢిల్లీ కోర్టు.. దోషులు తమ న్యాయపరంగా అర్హమైన అన్ని హక్కులను, అవకాశాలను వినియోగించుకోవాలని సూచించిన విషయం తెలిసిందే. కాగా వారం రోజుల వ్యవధి తరువాత అధికారులు శిక్షను అమలు పర్చే ప్రక్రియను ప్రారంభించవచ్చునని తెలిపింది. చట్టంలోని లోసుగులను వినియోగించుకుని దోషుల తమ శిక్షను జాప్యం చేస్తున్నారని అవేదన వ్యక్తం చేసిన నిర్భయ తల్లి ఆశాదేవి ఢిల్లీ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతించారు.
ఈ కేసులో దోషులైన నలుగురు ఒకే నేరానికి పాల్పడినందున.. అందరికీ కలిపి ఒకేసారి శిక్షను అమలు చేయాల్సి వుంటుందని న్యాయస్థానం తెలిపింది. ఈ సందర్భంగా నిర్భయ దోషులకు శిక్షను విడివిడిగా అమలు చేయాలన్న సాలిసిటర్ జనరల్ పిటీషన్ ను కోట్టివేసింది. దోషులకు వేర్వేరుగా శిక్షను అమలుపర్చేందుకు నిబంధనలు విరుద్ధంగా ఉన్నాయని, తీహార్ జైలు నిబంధనలను కోడ్ చేస్తూ ఆ విధంగా ఉరితీయలేమన్న అంశాలను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేష్ కుమార్ ఖైట్ స్పష్టం చేశారు. కాగా ఈ కేసులో ఇప్పటికే దోషులు వినయ్, ముఖేష్ కు సంబంధించి న్యాయపరమైన అవకాశాలన్నీ ముగిసిపోయాయి. పవన్ కు సంబంధించి క్యురేటివ్ పిటిషన్, అలాగే మెర్సీ పిటిషన్ ఫైల్ చేయాల్సివుంది.
దోషులకు శిక్షలను అమలు చేయడంలో ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు వెళ్లింది. దోషులకు వేర్వేరుగా ఉరిశిక్ష అమలు సాధ్యంకాదన్న ఢిల్లీ హైకోర్టు.. దోషులకు వారం రోజుల గడువు ఇచ్చింది. క్షమాభిక్ష అన్ని అవకాశాలను ఉపయోగించుకోవడానికి వారం రోజులు గడువు ఇచ్చింది. నలుగురు దోషులను ఒకేసారి ఉరితీయాలని హైకోర్టు తెలిపింది. వేర్వేరుగా ఉరితీయాలన్న కేంద్రం వినతిని తోసిపుచ్చింది. నిర్భయ దోషుల మరణశిక్షపై ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇక ఈ క్రమంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింగ్ కూడా దోషి అక్షయ్ ఠాకూర్ క్షమాబిక్ష పిటీషన్ ను తిరస్కరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more