Nirbhaya case: President rejects mercy plea of Akshay Thakur ‘నిర్భయ’ దోషి అక్షయ్ క్షమాభిక్ష్ పిటీషన్ తిరస్కరణ

Nirbhaya case president rejects akshay thakur s mercy petition

Nirbhaya convicts, Execution, Justice Suresh Kait, Delhi High Court, Tihar Jail authorities, Nirbhaya case convicts, Tihar jail, Nirbhaya convicts hanging, Nirbhaya case, Nirbhaya convicts mercy petition, Satish Kumar Arora, Supreme Court, Additional Registrar, deputation basis, nirbhaya murder case Pawan Gupta, Mukesh singh, Vinay Sharma, Akshay Thakur, Nirbhaya, Murder, Rape, Supreme Court, gang-rape, Mount Elizabeth Hospital, Tihar jail, Crime

President Ram Nath Kovind has rejected the mercy petition of Akshay Kumar Singh, one of the four men facing the gallows in the 2012 Nirbhaya gangrape and murder case, Home Ministry officials said.

‘నిర్భయ’ కేసు: దోషి అక్షయ్ క్షమాభిక్ష్ పిటీషన్ తిరస్కరణ

Posted: 02/06/2020 11:26 AM IST
Nirbhaya case president rejects akshay thakur s mercy petition

దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచారం కేసులో దోషులకు శిక్ష ఎప్పుడు విధిస్తారోనని యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న వేళ.. వరస వాయిదాలకు క్రితం రోజు స్వస్తి పలికిన ఢిల్లీ కోర్టు.. దోషులు తమ న్యాయపరంగా అర్హమైన అన్ని హక్కులను, అవకాశాలను వినియోగించుకోవాలని సూచించిన విషయం తెలిసిందే. కాగా వారం రోజుల వ్యవధి తరువాత అధికారులు శిక్షను అమలు పర్చే ప్రక్రియను ప్రారంభించవచ్చునని తెలిపింది. చట్టంలోని లోసుగులను వినియోగించుకుని దోషుల తమ శిక్షను జాప్యం చేస్తున్నారని అవేదన వ్యక్తం చేసిన నిర్భయ తల్లి ఆశాదేవి ఢిల్లీ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతించారు.

ఈ కేసులో దోషులైన నలుగురు ఒకే నేరానికి పాల్పడినందున.. అందరికీ కలిపి ఒకేసారి శిక్షను అమలు చేయాల్సి వుంటుందని న్యాయస్థానం తెలిపింది. ఈ సందర్భంగా నిర్భయ దోషులకు శిక్షను విడివిడిగా అమలు చేయాలన్న సాలిసిటర్ జనరల్ పిటీషన్ ను కోట్టివేసింది. దోషులకు వేర్వేరుగా శిక్షను అమలుపర్చేందుకు నిబంధనలు విరుద్ధంగా ఉన్నాయని, తీహార్ జైలు నిబంధనలను కోడ్ చేస్తూ ఆ విధంగా ఉరితీయలేమన్న అంశాలను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేష్ కుమార్ ఖైట్ స్పష్టం చేశారు. కాగా ఈ కేసులో ఇప్పటికే దోషులు వినయ్, ముఖేష్ కు సంబంధించి న్యాయపరమైన అవకాశాలన్నీ ముగిసిపోయాయి. పవన్ కు సంబంధించి క్యురేటివ్ పిటిషన్, అలాగే మెర్సీ పిటిషన్ ఫైల్ చేయాల్సివుంది.

దోషులకు శిక్షలను అమలు చేయడంలో ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు వెళ్లింది. దోషులకు వేర్వేరుగా ఉరిశిక్ష అమలు సాధ్యంకాదన్న ఢిల్లీ హైకోర్టు.. దోషులకు వారం రోజుల గడువు ఇచ్చింది. క్షమాభిక్ష అన్ని అవకాశాలను ఉపయోగించుకోవడానికి వారం రోజులు గడువు ఇచ్చింది. నలుగురు దోషులను ఒకేసారి ఉరితీయాలని హైకోర్టు తెలిపింది. వేర్వేరుగా ఉరితీయాలన్న కేంద్రం వినతిని తోసిపుచ్చింది. నిర్భయ దోషుల మరణశిక్షపై ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇక ఈ క్రమంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింగ్ కూడా దోషి అక్షయ్ ఠాకూర్ క్షమాబిక్ష పిటీషన్ ను తిరస్కరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles