అమరావతిలోనే రాష్ట్ర రాజధానిని కొనసాగించాలని.. రాజధాని కోసం తమ భావితరాల బంగారు భవిష్యత్తు కోసం తాము చేసిన త్యాగాలను సహృద్భావంతో అర్థం చేసుకోవాలని కోరుతూ దీక్షలు, ధర్నాలు చేస్తున్న రైతులు ఇక ఉద్యమం మరింత ఉదృతంగా సాగే చర్యలకు పోలీసులు బ్రేకులు వేస్తున్న నేపథ్యంలో వారిని సహాయ నిరాకరణ చేయాలని సంకల్పించారు. ఈ మేరకు రాజధానిగా అమరావతి రైతులు నిర్ణయించుకున్నారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ అవలంభించిన ఉద్యమాన్ని రాజధాని కొనసాగింపు లో చేపట్టాలని పూనుకున్నారు.
తుళ్లూరు గ్రామంలో పోలీసులు కొన్ని రోజుల నుంచి అక్కడే పహారా కాస్తున్నారు. ముఖ్యమంత్రి సచివాలయానికి వెళ్లి, వచ్చే ప్రాంతం కాబట్టి.. ఈ ప్రాంతంలో ఆనయ కాన్వాయ్ కు అడ్డగించే చర్యలకు గ్రామస్థులు పూనుకోకుండా పోలీసుల పహారా ఏర్పాటు చేశారు. అయితే క్రమంగా రాజధాని ప్రాంతంలో రైతులు ఉద్యమాన్ని చేపట్టడం.. ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్లే సమయంలో నల్ల జెండాలు.. ప్లకార్డులు ప్రదర్శించడంతో ఉన్నతాధికారుల అదేశాలతో పోలీసు బలగాలు మరింతగా పెరిగాయి. దీంతో వారిలో అనేకమంది ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి వచ్చినవారే కావడంతో.. రాజధాని ప్రాంతంలోని హోటళ్లను ఆశ్రయిస్తున్నారు.
అహర్నిషలు అక్కడి రోడ్లపైనే విధులు నిర్వహిస్తున్నారు. దీంతో స్థానికంగా ఉండే హోటళ్లను ఆశ్రయించి అందులో లభ్యమయ్యే పలహారాలు, బోజనాలతో రోజులను వెల్లదీస్తున్నారు. అయితే ఉన్నాతాధికారుల నుంచి వచ్చే అదేశాల మేరకు వీరు ఎక్కడైతే తింటున్నారో.. అక్కడివారినే ప్రతినిత్యం నియంత్రిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల వెలగపూడిలో జరిగిన మహిళలపై దాడి, ఆ తరువాత మందడం మహిళలపై తమ జులుం ప్రదర్శించడంతో పాటు దాడి చేసి గాయపర్చిన క్రమంలో రైతులు పోలీసులకు సహాయ నిరాకరణ చేయాలని నిర్ణయించుకున్నారు.
ఈ సహాయ నిరాకరణలో భాగంగా ఇకపై పోలీసులకు తమ హోటళ్లలో పలహారాలు, బోజనాలు, టీ, కాఫీలు, చివరకు నీళ్ల బాటిళ్లు కూడా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో పోలీసులు వాటర్, టిఫిన్లు బయటి నుంచి తెప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా, కొంతమంది పోలీసులకు స్థానికులే భోజనాలు పెడుతున్నారు. వారిని కొట్టిన పోలీసులకే స్థానికులు ఆహారం పెడతున్నారు. తాగటానికి నీళ్లు ఇస్తున్నారు. అపకారికి ఉపకారం చేయడం తెలుగువాడి గొప్పదనమని కొందరు ప్రశంసించగా, వాళ్లు మాత్రం ఏం చేస్తారు.. ఉన్నతాధికారులు అదేశాలను అమలు చేస్తారు. వారి ఇష్ట ప్రకారం ఏమీ చేయలేరుగా అంటూ వెనకేసుకువస్తున్నారు.
అయితే శుక్రవారం తుళ్లూరు, వెలగపూడి, మందడం గ్రామస్థులపై పోలీసుల ప్రదర్శించిన దౌర్జన్యం అంతా ఇంతా కాదు. మహిళలని..యువతులని కూడా చూడకుండా ఇష్టమొచ్చినట్లు కొట్టారు. రక్తాలు కారేలా కొట్టారు. కనకదుర్గమ్మ దేవాలయానికి ర్యాలీగా వెళ్లాలనుకున్న మహిళలపై తమ ప్రతాపాన్ని చూపారు. ఆడ, మగ, పిల్లా, పెద్ద అన్న తేడా లేకుండా మరీ దారుణంగా వ్యవహరించి వారిపై లాఠీలను జుళిపించారు. దీంతో మహిళలు, యువతులు పోలీసులపై ఎదురు తిరిగారు. దీంతో మహిళలపై కూడా పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఈ తరుణంలో పోలీసులకు సహాయనిరాకణ చేయాలని పిలుపునిచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more