బీజేపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి రాష్ట్రంలో పొలిటికల్ బాంబు పేల్చారు. సుజనా వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన పార్టీల ఎంపీలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. మరీ ముఖ్యంగా టీడీపీ దుకాణం పూర్తిగా ఖాళీ అవుతుందని, ఇన్నాళ్లు క్రమశిక్షణ గల పార్టీ అని, నాయకులను తయారు చేసే కర్మాగారమని చెప్పుకున్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరలో ఒంటరి కాబోతున్నారని తెలిపారు. అంతటితో ఆగని సుజనా రాష్ట్రంలోని అధికార పార్టీని కూడా అలర్ట్ చేశారు. ఇంతకీ ఆయన పేల్చిన రాజకీయ బాంబు ఏంటీ?
ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపి పార్టీతో టచ్ లో వున్నారని తెలిపారు. ఈ క్రమంలో టీడీపీ చెందిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కూడా తమ పార్టీలోకి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారన్నారు. ఆ తరువాత తనకు తానుగానే ఆ సంఖ్యను సరిచేస్తూ టీడీపీలో మొత్తం 20 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని తెలిపారు. ఇక అధికార పార్టీ నుంచి కూడా పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు.
అయితే తమతో టచ్ లో వున్నా.. ఎవరినీ ఇప్పటికిప్పుడు బీజేపీలో చేర్చుకోబోమని... సమయం, సందర్భం వచ్చినప్పుడే వారిని తమ పార్టీలో చేర్చుకుంటామని చెప్పారు. దీనికి తోడు పలువురు ఎమ్మెల్యేలు కూడా తమకు కొంత సమయం కావాలని కొరారని.. తగిన సమయంలో వారందరూ బీజేపిలో చేరుతారని ఆయన అన్నారు. పార్లమెంటులో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు భుజం మీద చేయి వేసి 'రాజు గారు' అంటూ ప్రధాని మోదీ పలకరించడంపై స్పందిస్తూ, నమస్కారం పెట్టిన వారికి ప్రతినమస్కారం చేయడం మోదీ సంస్కారమని సుజనా చౌదరి చెప్పారు.
ఇందులో చర్చించుకోవడానికి ఏమీ లేదని అన్నారు. దీనిపై రకరకాలుగా ఊహించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీ నేతలతో ఎవరితో టచ్ లో ఉన్నారో తనకు తెలియదని సుజనా చౌదరి తెలిపారు. తనతో మాత్రం ఆయన టచ్ లో లేరని స్పష్టం చేశారు. ఇతర పార్టీలతో పొత్తుల కోసం తాము ఇప్పటి నుంచే వెంపర్లాడటం లేదని చెప్పారు. ఏపీలో అధికారాన్ని చేపట్టడానికి బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. ఏపీకి బీజేపీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more