తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో కేంద్రం షాక్ ఇచ్చింది. బీజేపి, కాంగ్రెస్ ఫ్రభుత్వాలు గతంలో మంజూరు చేసిన అగ్గిపెట్టల్లాంటి ఇళ్ల నిర్మాణాలను కాకుండా పేదలు కూడా హుందాగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో కాపురం చేయాలని యోచించిందీ తెలంగాణ సర్కార్. అందుకోసం తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూం గదులను నిర్మిస్తోంది. అయితే అనేక ప్రాంతాల్లో ఇళ్లు నిర్మాణాలు రమారమి పూర్తి దశకు కూడా చేరుకున్నాయి.
అయితే ఇక్కడే కేంద్ర ప్రభుత్వం షాక్ రాష్ట్ర ప్రభుత్వానికి గట్టిగా తగిలింది. ఈ పథకంలో భాగంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వం విధిల్చడం లేదని చెబుతోంది. కేంద్రం నుంచి గతంలో అందిన తొలి విడుత నిధులు మినహాయిస్తే ఇప్పటి వరకు రెండు, మూడు దశల కింద రావాల్సిన నిధులు ఇంకా విడుదల కాలేదు. ఈ రెండు విడదల నిదులు కలపి మొత్తంగా రూ.1800 కోట్ల నిధులు విడుదల చేసేందుకు కేంద్ర కోర్రీలు పెడుతోందని సమాచారం. 8 నెలలుగా నిధుల కోసం అభ్యర్థిస్తున్నా ఇచ్చేది లేదని తెగేసి చెబుతోంది.
అయితే ఆ కొర్రీలో కూడా బలమైన పాయింట్ వుందని కాషాయ పార్టీ నేతలు అభిప్రాయపడతున్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల లబ్ధిదారుల జాబితా ఇస్తేనే నిధులు ఇస్తామని కేంద్రం ఖరాఖండీగా చెబుతోంది. దీంతో నిర్మాణ దశలో ఉండగానే లబ్దిదారులను ఎంపిక చేస్తే అది అనవసర సమస్యలకు కారణంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇక దీనికి జాబితాను అప్పుడే విడుదల చేస్తే.. లబ్దిదారుల ప్రయోజనాల కన్నా.. వాటిని అందుకోలేకపోయిన వారిలో నిరుత్సాహం, అసంతృప్తి పెల్లుబిక్కుతుందని దీంతో రాజకీయాంగానే తమకు నష్టం వాటిల్లనుందని గులాభి నేతలు వాదిస్తున్నారు.
దీనికి తోడు లబ్దిదారుల ఎంపిక ముందుగానే చేపట్టడం ద్వారా అన్ని వర్గాల ప్రజల నుంచి రాజకీయ ఒత్తిళ్లకు కూడా కారణం అవుతోందని అభిప్రాయాలు వినబడుతున్నాయి. తమ ప్రభుత్వం పేదల కోసం తీసుకువచ్చిన బృహత్తర పథకం కాస్తా విమర్శలు, సమస్యలతో అప్రయోజనంగా మారే అవకాశం వుంటుందని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. తొలి విడుదల నిధులకు ఎలాంటి కొరివి పెట్టకుండా విడుదల చేసిన కేంద్రం.. రెండు మూడవ విడదల నిధులను మంజూరు చేయడంలో ఎందుకు కొర్రీలు పెడుతోందని మండిపడుతున్నారు.
నిజానికి ఒక్కో డబుల్ బెడ్రూం ఇంటికి దాదాపు రూ. 9 లక్షలు ఖర్చవుతుండగా, కేంద్రం తన వంతుగా లక్షన్నర రూపాయలు ఇస్తోంది. ఈ లెక్కన జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మిస్తున్న లక్ష ఇళ్లకు కేంద్రం నుంచి ఇంకా రూ.1500 కోట్లు రావాల్సి ఉంది. ఇందులో మొదటి విడత కింద రూ.600 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం ఇంకా రూ.900 కోట్లతోపాటు ఇతర జిల్లాలో నిర్మిస్తున్న ఇళ్లకు సంబంధించి మరో రూ.900 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడీ నిధుల విడుదల విషయంలో కొర్రీలు పెడుతూ లబ్ధిదారుల జాబితాను తీసుకురమ్మని చెబుతోంది. ఆ జాబితా ఇస్తేనే నిధుల విడుదల గురించి ఆలోచిస్తామని తేల్చి చెప్పడంతో ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more