ఆందప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ ఎన్నికల నిర్వహణకు గత కొన్ని నెలలుగా హైకోర్టులో నానుతున్న పిటీషన్ ను రాష్ట్రోన్నత న్యాయస్థాన ధర్మాసనం కోట్టివేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయతీ, మండల, జిల్లా పరిషత్ లకు త్వరలో నగరా మ్రోగననుంది. రాష్ట్రంలోని స్థానిక సంస్థల కాలపరిమితి ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. తాజాగా, గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు మరోమారు హైకోర్టు నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన అదేశాలు లభించాయి. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని గతేడాది అక్టోబరులో ఉమ్మడి హైకోర్టు ఆదేశించినా ఆ అదేశాలు ఇంత వరకు అమలుకు నోచుకోలేదు.
ఆ ప్రక్రియను నిలువరించలేమని న్యాయస్థానం తేల్చిచెప్పింది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50 శాతం దాటేందుకు వీలు కల్పించే ఏపీ పంచాయతీరాజ్ చట్టంలోని పలు సెక్షన్లు రద్దుచేయాలని కోరుతూ గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన నవీన్కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ శ్యాంప్రసాద్ లతో కూడిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం.. దీనిపై తీర్పు వచ్చేవరకు ఎన్నికలు నిలువరించాలన్న పిటిషనర్ అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, న్యాయశాఖతోపాటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు కూడా నోటీసులు జారీచేసింది.
నవీన్ కుమార్ తరఫున న్యాయవాది ఓ.మనోహర్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. రిజర్వేషన్లు 50 శాతానికి మించడానికి వీల్లేదని డాక్టర్ కె.కృష్ణమూర్తి కేసులో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిందని అన్నారు. ప్రస్తుత చట్టంలో సెక్షన్లు దానికి విరుద్ధంగా ఉన్నందున ఎన్నికలు నిలుపుదల చేయాలని కోరారు. ప్రభుత్వ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల ప్రక్రియను కొనసాగినివ్వాలని కోరారు. పూర్తి వివరాలతో అఫిడ్విట్ దాఖలు చేయడానికి కొంత సమయం ఇవ్వాలని ఆయన అభ్యర్థించారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ప్రతివాదులకు నోటీసులిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదావేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more