మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నతస్థాయి అధికారులు, బ్యూరోక్రాట్ల నుంచి రాజకీయ నేతల వరకు ఎందరి గుట్టునో పట్టుకుని వారి నుంచి అందినకాడికి డబ్బులు గుంజడంతో పాటు వారి చేత అక్రమంగా ఎన్నో పనులు కూడా చేయించుకున్న హనీట్రాప్ గ్యాంగ్ ఉచ్చు వెలుగుచూసిన నేపథ్యంలో అదే పంథాను వినియోగించుకుని తన భూ వివాదాన్ని పరిష్కరించుకోవాలని ప్రయత్నించిన ఓ ఘనుడితో పాటు అతను చెప్పిందల్లా చేసిన ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమ్మాయిలను ఎరగా వేసి లక్షలాది రూపాయలు గుంజేందుకు ప్రయత్నించిన ఏడుగురు సభ్యుల ముఠా సామర్లకోట పోలీసులకు చిక్కి కటకటాలు లెక్కిస్తోంది.
తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో ఈ నెల ఏడో తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జి.మామిడాడకు చెందిన ఫైనాన్స్ వ్యాపారి తాడి కేదార మణికంఠరెడ్డికి.. స్థానికంగా జై ఆంధ్రా చానల్ నిర్వహిస్తున్న తేతలి దుర్గారెడ్డి అనే ఇద్దరు స్నేహితులు. అయితే వీరిద్దరి మధ్య ఓ స్థల వివాదం ఏర్పడి.. అది కాస్తా వారి మధ్య వైరానికి దారి తీసింది. అయితే ఈ సమస్యను సక్రమంగా పరిష్కరించుకునే క్రమంలో ఏళ్లు పడుతుందని యోచించిన దుర్గారెడ్డి.. మణికంఠరెడ్డిని ఎలాగైనా లొబర్చుకోవాలని వక్రంగా ఆలోచించాడు.
తన చానల్ లో పనిచేస్తున్న రాకేశ్ అనే వ్యక్తి సాయంతో మహేశ్, అశ్విని అనే భార్యభర్తలను రంగంలోకి దింపాడు. అశ్వని సహకారంతో హనీట్రాప్ చేయాలని పథకం రచించారు. మడికి అశోక్ అనే వ్యక్తి ఇంటికి కేదార మణికంఠ రెడ్డిని అశ్వినీ ద్వారా రప్పించాలనుకున్నారు. ఈ క్రమంలో మణికంఠరెడ్డికి ఫోన్ చేసిన అశ్విని మాయమాటలతో అశోక్ ఇంటికి అతడిని రప్పించింది. అమె మాయమాటలకు లొంగిపోయిన కేదార మణికంఠరెడ్డి అశోక్ ఇంటికి వెళ్లాడు. తనకు ఫోన్ చేసింది తానేనన మణికంఠరెడ్డికి ఎదురుగా వచ్చిన అశ్విని.. అతడ్ని గదిలోకి తీసుకెళ్లింది. వారు వెళ్లిన మరుక్షణం అక్కడే కాపుకాసిన బ్లాక్ మెయిల్ ముఠా.. వారి వీడియో తీసింది.
ఇక వెంటనే రంగంలోకి దిగిన ముఠాసభ్యులు.. కేదార మణికంఠరెడ్డికి వీడియోలు చూపించి లోంగదీసుకోవాలని ప్రయత్నించినా.. అది కుదరలేదు. అతను అదరలేదు.. బెదరలేదు.. దీంతో ఇక లాభం లేదన్నకున్న ముఠా మణికంఠరెడ్డిని నిర్భందించింది. అక్కడే కుర్చీకి కట్టేసిన ముఠా సభ్యులు అతడ్ని చిత్రహింసలకు గురిచేసి రూ.25 లక్షలు డిమాండ్ చేశారు. లేని పక్షంలో అతడి వీడియోలు బయటపెడతామని బెదిరించారు. దీంతో మణికంఠరెడ్డి రూ.50 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీనికి సరేనన్న ముఠా సభ్యులు.. కేదార్ వద్ద ఉన్న రూ.63 వేల నగదు, బంగారు ఆభరణాలు లాక్కుని తెల్లకాగితాలపై సంతకాలు, వేలిముద్రలు తీసుకుని పరారయ్యారు.
జరిగిన ఘటనపై తీవ్ర మనోవేదనకు గురైన కేదార మణికంఠారెడ్డి.. తనకు ఎదురైన పరిణామాలన్నింటినీ అనుమానించి పోలీసులకు పిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అత్యంత చాకచక్యంగా వారం రోజులు తిరగకుండానే ముఠా సభ్యులను కటకటాల వెనక్కి పంపారు. ఈనెల 14న ఇంద్రపాలెంలో ఒక ఇంటిలో ఉన్న నిందితులు ఆరుగుళ్ల మహేష్, భూరి అశ్విని, నిమ్మకాయల సతీష్, తోట సందీప్, బొడ్డుపు రాజేష్కుమార్, ఎలుడుట్టి లక్ష్మీనారాయణ, మడికి అశోక్లను అదుపులోకి తీసుకుని విచారించగా, నేరాన్ని వారు అంగీకరించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన దుర్గారెడ్డి, రాకేష్ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more