కాశ్మీర్ పై పాక్ విష ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు భారత్ వేగంగా అడుగులు వేస్తోంది. దేశంలోని విపక్ష నేతలు కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని అరెస్టు చేసి తిప్పిపంపిన భారత బలగాలు.. తాజాగా మాత్రం విదేశీ పార్లమెంటు సభ్యుల బృందాన్ని అక్కడ పర్యటించేందుకు అనుమతించనుంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా జమ్మూకశ్మీర్ లో విదేశీ బృందానికి పర్యటించేందుకు భారత ప్రభుత్వం అనుమతిచ్చింది. 28సభ్యులతో కూడిన యూరోపియన్ పార్లమెంట్ బృందం జమ్మూకశ్మీర్ లో పర్యటించనుంది.
ఇవాళ ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ఎన్ఎస్ఏ చీఫ్ అజిత్ దోవల్ తో ఈ బృందం సమావేశం కానుంది. కశ్మీర్ లో పరిస్థితులను ఈ బృందానికి మోడీ,దోవల్ వివరించనున్నారు. ఈ ఏడాది ఆగస్టు 5న జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో వ్యాలీలో ఎటువంటి అల్లర్లు జరగకుండా,ముందుజాగ్రత్త చర్యగా ఆంక్షలు విధించారు. ఇంటర్నెట్ సస్పెండ్ చేశారు. పలువురు నాయకులను అదుపులోకి తీసుకున్నారు.
అప్పటినుంచి ఒక్కొక్కటిగా కశ్మీర్ లో ఆంక్షలను సడలిస్తుంది ప్రభుత్వం. అదుపులోకి తీసుకున్న పలువురు నాయకులను వదిలిపెట్టింది.
అయితే అదుపులోకి తీసుకుని ఇప్పటికీ విడుదల చేయబడని మాజీ సీఎంలు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, ఫరూక్ అబ్దుల్లా సహా మరికొందరు నాయకులను వెంటనే రిలీజ్ చేయాలని భారత్ ను ఇటీవల అమెరికా కోరింది. కశ్మీర్ లో పరిస్థితులను పరిశీలించేందుకు అంతర్జాతీయ జర్నలిస్టులకు అవకాశం కల్పించాలని కోరారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆ దేశ పరిస్థితులపై పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని వైట్ హౌస్ తెలిపిన విషయం తెలిసిందే.
ఇటీవల పోస్ట్ పెయిడ్ సర్వీసులను వ్యాలీలో పునరుద్దరించడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. కశ్మీర్ లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ పాక్ ఆరోపణలు చేయడం,దానికి అమెరికా వంత పాడటం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో కశ్మీర్ విషయంలో పాక్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని కళ్లారా ప్రపంచానికి చూపించేందుకు విదేశీ ప్రతినిధి బృందం కశ్మీర్ లో పర్యటించేందుకు భారత్ అనుమతించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more