రాజకీయ నేతలు సంచలనాల కోసం మాట్టాడటం ఇప్పుడు పరిపాటిగా మారిపోయింది. ఇక ఎన్నికల సమయం ముంచుకోస్తుందంటే ఏడాది నుంచి నేతల మాటల తూటాలు మార్మోగిపోతుంది. ఇక తమ మాటల వెనుక దాగున్న అర్థం ఏంటో తెలియకుండా తికమకపెట్టే విధంగా అర్జునుడి బాణంలా కూడా నేతలు తమ మాటలను సంధిస్తారు. ముందున్న అద్దంలోకి చూస్తూ వెనుకనున్న లక్ష్యాన్ని సంధించడంలో మన నేతలు అర్జునుడిని మించిన ఘణాపాటీలే.
ఇక తాజాగా నితిన్ గడ్కరీ చేసిన కామెంట్లను కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ.. తమ పార్టీకి అనుకూలంగా మలిచేసుకుని తెగ వాడేసుకుంటున్నారు. నితిన్ గడ్కరీ ఉద్దేశ్యం ఏమిటో తెలియదు గానీ.. ఇటీవల ఆయన చేస్తున్న సంచలన కామెంట్స్ బీజేపీని ఇరుకున పెట్టేస్తున్నాయి. తాజాగా నాగ్పూర్ వేదికగా జరిగిన ఏబీవీపీ పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ చేసీన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.
చాలామంది కార్యకర్తలు పార్టీ కోసం ఏదైనా చేస్తామని చెబుతుంటారు. ముందు వాళ్లంతా తమ కుటుంబాన్ని, పిల్లల్నీ పట్టించుకోవాలి. ఇల్లు, ఇల్లాలు, పిల్లలను చూసుకోలేనివాళ్లు దేశాన్ని ఏం కాపాడుతారు?’’ అని గడ్కరీ వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో కలకలం రేపాయి. కచ్చితంగా.. ఆయన మోదీని ఉద్దేశించే చేసి ఈ వ్యాఖ్యలు చేసిఉంటారనే ప్రచారం ఊపందుకుంది.
గడ్కరీ అన్నది మోదీని ఉద్దేశించేనా? అన్నది పక్కనబెడితే, ఆ వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మలిచేసుకున్నారు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ. ట్విట్టర్ వేదికగా గడ్కరీని ప్రశంసలతో ముంచెత్తారు. బీజేపీలో దమ్మున్న నాయకుడు ఆయనొక్కరే అంటూ గడ్కరీని ఆకాశానికి ఎత్తేశారు. ఇదే విధంగా, రాఫెల్ డీల్ విషయంలో అనీల్ అంబాని కంపెనీ విషయంపై కూడా ఆయన మాట్లాడాలని కోరారు. అంతేకాదు రైతుల ఆత్మహత్యలపై కూడా ప్రభుత్వాన్ని నిలదీయాలని.. వ్యవస్థల నిర్వీర్యం చేయడంపై మాట్లాడాలని కోరారు.
Gadkari Ji, compliments! You are the only one in the BJP with some guts. Please also comment on:
— Rahul Gandhi (@RahulGandhi) February 4, 2019
1. The #RafaleScam & Anil Ambani
2. Farmers’ Distress
3. Destruction of Institutionshttps://t.co/x8BDj1Zloa
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more