రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుతం అధికారంలో వున్న బీజేపికి భంగపాటు తప్పదని ఆమ్ అద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ జోస్యం చెప్పారు. గత 2014 సార్వత్రిక ఎన్నికలలో బీజేపి సాధించిన సీట్లు సంఖ్య కన్నా అధిక స్థానాలను రానున్న సార్వత్రిక ఎన్నికలలో సాధిస్తామని బీజేపి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇటీవల ఓ జాతీయ మీడియాతో ప్రత్యేక ఇంటర్వ్యూలో స్పష్టం చేసిన నేపథ్యంలో దానిపై పక్షం రోజుల తరువాత స్పందించిన అరవింద్ కేజ్రీవాల్.. రానున్న ఎన్నికలలో మోడీ మానియా తుడిచిపెట్టుకుపోతుందని అన్నారు.
రానున్న సార్వత్రిక ఎన్నికలలో బీజేపీకి 215 స్థానాలకు మించి రావని ఆయన తేల్చేశారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తన ఫాలోవర్లతో ఈ విషయాన్ని పంచుకున్నారు. కొన్ని రోజుల క్రితం కొంత మంది తనని కలిశారని, ఇదే విషయాన్ని వారందరూ ఏకాభిప్రాయంగా చెప్పారని పేర్కోన్నారు. దేశంలో నిరుద్యోగం పెద్ద సమస్యగా అవతరించిందని, దీంతో యువత సతమతం అవుతోందని అన్నారు, తమ భవిష్యత్తు గురించి దేశీయ యువత దిగులు పడుతున్నారని పేర్కోన్నారు.
ఇక ఇప్పటికే నోట్ల రద్దు వ్యవహారం మోడీ ప్రభుత్వానికి అశనిపాతంలో పరణిమించిందని, దీనికి తోడు జీఎస్టీ అటు సాధారణ ప్రజలతో పాటు ఇటు వ్యాపారులు కూడా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ పరిణామాలతో మరీ ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలు విసిగిపోయారని ఆ ట్వీట్ లో కేజ్రీవాల్ పేర్కొన్నారు. అయితే ఈ ఏడాది చివర్లో సార్వత్రిక ఎన్నికలకు వెళ్తామన్న సంకేతాలను కేంద్రం ఇస్తున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కూడా ప్రజలకు లబ్ది చేకూర్చేలా లదేన్న విమర్శల నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ జ్యోతిష్యం కూడా వైరల్ గా మారింది.
Met several people in last few days.
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 5, 2018
Consensus amongst all - BJP getting less than 215 seats, unemployment biggest problem, youth worried abt its future, middle class very disenchanted wid BJP
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more