తెలంగాణలో భూ ఆక్రమణ కేసు కొత్త మలుపు తిరిగింది. కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కుంటున్న గోల్డ్ స్టోన్ కంపెనీ తెనే తుట్టే కదిలే కొద్ది సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. టీఆర్ఎస్ ఎంపీ(రాజ్యసభ) కేకే కూతురు విజయలక్ష్మి పేరు ఇందులో ప్రధానంగా వినిపిస్తోంది. ఆమె పేరిట 38 ఎకరాల భూమి ఉన్నట్లు విచారణలో వెల్లడైంది.
ఇబ్రహీం పట్నం దండు మైలారం లో ఈ భూమి ఉన్నట్లు తెలుస్తోంది. గోల్డ్ స్టోన్ కంపెనీ భూముల్నే ఆమె కొనుగోలు చేసినట్లు తేలింది. భూముల్ని సబ్ రిజిస్ట్రర్ ఖాదిర్ రిజిస్ట్రర్ చేయగా, అతనిపై ఇప్పటికే వేటు పడింది కూడా. సర్వే 36లో 38 ఎకరాల ఈ భూములను గద్వాల విజయలక్ష్మి కొనుగోలు చేసింది. భూ రాబందుల కహానీ
గోల్డ్ స్టోన్ పార్థసారథి అటవీ భూములను తమ కంపెనీకి చెందినట్లుగా చెప్పుకుని ఆమెకు కట్టబెట్టినట్లు విచారణలో వెల్లడైంది. ప్రభుత్వ భూములు అక్రమ రిజిస్ట్రేషన్ అని తేల్చిన అధికారులు. ప్రస్తుతం ఆమె టీఆర్ఎస్ లో అధికారిక సభ్యురాలిగా కూడా ఉంది.
మీడియాపై కేకే ఫైర్...
ఆరోపణలపై కేకే స్పందించాడు. తమ కుటుంబ సభ్యులు ఆ భూములను కొనుగోలు చేశారని అన్నారు. అయితే అందుకు సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నాయని, తాము చట్టప్రకారమే భూములు కొనుగోలు చేశామని వివరించాడు. మొత్తం 50 ఎకరాల్లో 38 ఎకరాలు మాత్రమే అక్రమమని తేలినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ భూమి విజయలక్ష్మితోపాటు జ్యోత్స్న, నవజ్యోతి పేరుతో రిజిస్ట్రర్ అయ్యి ఉంది.
అయితే 'గోల్డ్ స్టోన్ పార్థసారధి ఎలాంటివాడో తెలియదా?' అని మీడియా ప్రతినిధి రెట్టించడంతో ఆయన సహనం కోల్పోయారు. 'నేనేమన్నా బిచ్చగాడిననుకున్నావా? సారూ... బ్యాక్ గ్రౌండ్ తెలియకుండా కొనడానికి?' అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనిపై మీడియా ప్రతినిధి మళ్లీ ప్రశ్నించే ప్రయత్నం చేయడంతో....'నేనేం చెప్తున్నానో అర్థం చేసుకోండి...నీ కంటే పెద్ద జర్నలిస్టునే నేను' అంటూ మండిపడ్డాడు. 'రిజిస్ట్రార్ పెద్దా? సుప్రీంకోర్టు పెద్దా? చట్టాలు చేసే రాజ్యసభ సభ్యుడిని నాకు తెలియదా?' అని ఆయన ఎదురు ప్రశ్నించాడు. ఇందులో వివాదం ఏమీ లేదని, తాము సుప్రీంకోర్టు సూచనలతో రిజిస్టర్ చేయించామని, దీనిపై ఏవైనా వివాదం వస్తే....కోర్టు తీర్పు ధిక్కరణ కేసు వేస్తానని ఆయన హెచ్చరించాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more