ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుడైన పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యాను లండన్ పోలీసులు అరెస్టు చేశారు. భారత్ దేశంలోని పలు జాతీయ, ప్రైవేటు బ్యాంకులకు సుమారు 9 వేల కోట్ల పైచిలుకు రూపాయలను ఎగవేసి.. విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్తుడైన విజయ్ మాల్యను స్కాంట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్టు చేశారు. విందులకు, విలాసాలకు మారుపేరుగా నిలచి.. ప్రజాధనాన్ని దోచుకుని విదేశాలకు పారిపోయిన కింగ్ ఫిష్ ఎట్టకేలకు పోలీసుల వలకు చిక్కింది. ఆయనను కాసేపట్లో స్థానిక వెస్ట్ మినిస్టర్ న్యాయస్థానంలో హాజరపర్చనున్నారు.
బ్యాంకుల నుంచి 9 వేల కోట్ల రూపాయలను రుణంగా పొందిన విజయ్ మాల్యా.. వాటిని తీర్చేందుకు పలు షరుతులు పెడుతూ వచ్చారు. అసలు ఈడీకి తన వ్యాపార వ్యవహారాల గురించి ఏం తెలుసునంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. అంతటితో అగకుండా తాను ఇక భారత దేశానికి పోరబాటున కూడా రానని సంకేతాలను కూడా పంపించారు. తాను తీసుకున్న రుణాలలో అసలులో కూడా కొంత మాత్రమే చెల్లిస్తానని. ఇందుకు సమ్మతించాలని ఆయన తన తరపు న్యాయవాదితో దేశ సర్వోన్నత న్యాయస్థానంలో పిటీషన్ వేయిందారు.
తొలుత తనను దేశ అర్థిక నేరస్థుడని పతకా శీర్షికలను పెట్టిన దినపత్రికలను, మీడియాలపై కూడా ఆయన బ్లాక్ మెయిల్ చేసే ధోరణిలో వ్యాక్యలు చేశారు. తాను చేసిన మేలు.. సహాయాలను మీడియా సహా మీడియా యాజమాన్యాలు కూడా మర్చిపోయాయని, తనను నేరస్థుడిగా పరిగణిస్తున్నారని, తాను ఎక్కడికీ పారిపోలేదని, త్వరలోనే భారత్ కు తిరిగి వస్తానని అన్నారు. ఇలా పూటకో రకంగా మాట్లాడుతూ.. ప్లేటు ఫిరాయించిన మాల్యాను అరెస్టు చేసి తమకు అప్పగించాలని భారత్ లండన్ పోలీసులను కోరింది.
దీంతో గత కొంత కాలంగా లండన్లోనే ఉంటున్న మాల్యాను అక్కడి స్కాట్లాండ్ పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. స్థానిక వెస్ట్ మినిస్టర్ కోర్టులో హజరుపర్చనున్నారు. దీంతో లండన్ పోలీసుల నుంచి మాల్యను భారత్ రప్పించేందుకు భారత్ సీబిఐ అధికారులు కూడా సన్నధమయ్యారు. ఆ తర్వాత నేరగాళ్ల అప్పగింత ఒప్పందం కింద లండన్ నుంచి మాల్యాను భారతదేశానికి తీసుకురానున్నారు. ఇందుకోసం సీబిఐ బృందం సభ్యులు లండన్ బయలుదేరి వెళ్తున్నారు. ఆయనను అక్కడి నుంచి భారత్ తీసుకువచ్చేందుకు అప్పుడే ప్రయత్నాలను కూడా సీబిఐ అధికారులు ప్రారంభించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more