బీజేపి కార్యాలయంపై నాటు బాంబు.. Crude Bomb Hurled at BJP Office in Thiruvananthapuram

Crude bomb hurled at bjp office in thiruvananthapuram

BJP, crude bomb, Thiruvananthapuram city police commissioner, S Sparjan Kumar, state President Kummanam Rajasekharan, bomb blast at bjp office, Thiruvananthapuram

A crude bomb was hurled at the BJP office in Thiruvananthapuram, but there was no casualty, police said on Wednesday.

బీజేపి కార్యాలయంపై నాటు బాంబు దాడి..

Posted: 09/07/2016 09:31 AM IST
Crude bomb hurled at bjp office in thiruvananthapuram

కేరళలో బీజేపి పార్టీ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు బాంబు దాడులకు తెగబడ్డారు. నిన్న రాత్రి జరిగిన ఈ ఘటన తిరువనంతపురంలోని బీజేపి కార్యాలయం వద్ద చోటుచేసుకోగా, రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు నాటు బాంబులను బీజేపి కార్యాలయం ప్రధాన ద్వారంపైకి విసరడంతో.. ద్వారానికి ఉన్న అద్దాల తలుపులు దెబ్బతిన్నాయి. కార్యాలయంపై పై నలుగురు వ్యక్తులు పడుకున్నారని అయితే వారికి ఎలాంటి ప్రాణహానీ సంభవించలేదని, అందరూ సురక్షితంగా వున్నారని బీజేపి వర్గాలు పేర్కోన్నాయి.

కాగా బాంబు దాడిలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని పోలీసులు నిర్ధారించారు. కార్యాలయంలోని పై అంతస్తులో నలుగురు బీజేపీ కార్యకర్తలు ఉన్నారని, అయితే ఎవ్వరికీ ఎటువంటి గాయాలు కాలేదని తిరువనంతపురం సిటీ పోలీస్ కమిషనర్ ఎస్ స్పర్జన్ కుమార్ తెలిపారు. ప్రధానద్వారం పైకి ముడి బాంబును విసరడంతో కేవలం తలుపు అద్దాలు మాత్రం పగిలాయని ఆయన పేర్కొన్నారు. నిందితుల కోసం తామ గాలింపు చర్యలు చేపట్టామని చెప్పారు. నగరంలో వున్న సిసిటీవీ ఫూటేజీలను పరిశీలించి వారిపై చర్యలకు పూనుకుంటామన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  crude bomb  S Sparjan Kumar  Thiruvananthapuram  

Other Articles