సరిగ్గా రెండు రోజుల క్రితం పచ్చ మీడియా రాసిన కామెర్ల వార్తలకు సమాధానం దొరికిందా..? జనసేన పార్టీకి అధ్యక్షుడిగా వున్న పవన్ కల్యాన్ కు వెన్నుదన్నుగా నిలిచింది కేవలం అయన అభిమానులేనని, అయితే అభిమానుల బలంతో ఆయన రానున్న ఎన్నికలలో పోటీచేయడానికి ముందుకు సాగుతున్నారని.. ఇలా అయితే అయన పార్టీ నిలదోక్కుకోవడం కష్టమని పచ్చ మీడియా రాసిన రాతలకు అప్పుడే సమాధానం వచ్చేసింది. ఆంద్రప్రదేశ్ యువత భవితను తాకట్టు పెట్టేంత అభిమానం తనకు ప్రధాని నరేంద్రమోడీపై లేదని చెప్పిన పవన్ వ్యాఖ్యలు నచ్చే.. లేక యువతకు ఆయనిస్తున్న అగ్రతాంబులం ఇచ్చే జనసేనాని చూసో.. కదిలాడు ఓక ప్రజాప్రతినిధి.
ఎన్నికలకు ఇంకా రెండున్నర ఏళ్లు వున్నా.. తనకు అధికారం వద్దనుకున్నాడో.. ఎలా వచ్చే విమర్శలకు, ప్రశ్నలకు తాను సమాధానం చెబుతాననుకున్నాడో కానీ.. ఏకంగా విజయవాడకు చెందని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు జనసేనకు మద్దతుగా ఫెక్సీలను ఏర్పాటు చేశారు. విజయవాడలోని పలు ప్రముఖ కూడళ్ల వద్ద ఈ ఫ్లెక్సీలు జనసేన కార్యకర్తలను మరింత ఉత్తేజ పరుస్తుండగా, అధికార టీడీపీలో మాత్రం ప్రకంపనలకు కారణంగా మారుతుంది. ఎల్లో మీడియా రాతలకు చెక్ పెడుతుంది.
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నగరంలో ఆయన పెట్టించిన ప్లెక్సీలు చర్చనీయాంశంగా మారాయి. టీడీపీ గుర్తు, సీఎం చంద్రబాబు నాయుడు ఫొటోలు లేకుండా ప్లెక్సీలు తయారు చేయించారు. పవన్ కళ్యాణ్, తన ఫొటోలు మాత్రమే ప్లెక్సీల్లో ఉండడంతో తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. అధినేత, పార్టీ గుర్తు లేకుండా పవన్ తో తననొక్కడి ఫొటోలు మాత్రమే వేయించుకోవడంతో ఎమ్మెల్యే బొండా వ్యవహారంపై టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు టీడీపీ ఎంపీలు ఏమాత్రం చిత్తశుధ్ధి ప్రదర్శించడం లేదని పవన్ కళ్యాణ్ విమర్శించిన నేపథ్యంలో ఎమ్మెల్యే బొండా ప్లెక్సీలు పెట్టించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more