రిపబ్లికన్ పార్టీ నేత, ప్రముఖ వ్యాపారవేత్త డోనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా రిపబ్లికన్ అభ్యర్థిగా రేసులో ముందంజలో వున్న ట్రంప్ తన వివాదాస్పద వ్యాఖ్యాలతో మరింత ప్రచారంతో దూసుకుని పోతున్నారు. నడిరోడ్డులో కాల్పులు జరిపినా.. తనను అమెరికా అధ్యక్షుడిగా కాకుండా ఎవరూ అపలేరని సంచలనాలకు తెరతీసిన ట్రంప్.. తనది కూడా చాల పెద్దది అంటూ హేయకరమైన వ్యాక్యలు కూడా చేసి విమర్శలపాలయ్యారు. తనకు మద్దతిస్తున్న అమెరికా భారతీయులపై కూడా విమర్శలు చేసి.. అమెరికా వాసుల దృష్టిలో తన ప్రభావాన్ని చాటుకునే ప్రయత్నం చేశారు.
తాజాగా, ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్, టెర్రరిస్టులను చంపడంలో చాలా మంచివాడని అమెరికన్ అధ్యక్షబరిలో రిపబ్లికన్ పార్టీ తరఫున ముందు వరుసలో ఉన్న ట్రంప్ వ్యాఖ్యనించారు. సద్దాం విషయంపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై నిప్పులు చెరిగారు. ఓహియోలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ మట్లాడుతూ... ఇరాక్, ఇరాన్ దేశాలను హస్తగతం చేసుకుని క్రూడాయిల్ పై ఆధిపత్యం చెలాయించాలని ఒబామా యత్నించారని ట్రంప్ మండిపడ్డారు. అందులో భాగంగానే ఇరాక్ పైకి అమెరికా సైన్యాన్ని ఒబామా పంపించారని ఆరోపించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ తన విమర్శలకు మరింత పదునుపెట్టారు.
2003లో ఇరాక్ పై అమెరికా పాల్పడిన చర్యలకు తాను ఎప్పుడూ వ్యతిరేకమేనని వెల్లడించారు. మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో నియంత్రణ కోసం ప్రయత్నించవద్దని గతంలోనే హెచ్చరించినట్లు ట్రంప్ తెలిపారు. ఈ కారణాల వల్లే ఐఎస్ఎస్ ఉద్భవించిందంటూ ఆరోపించారు. సద్దాం హుస్సేన్ గురించి మరోసారి ప్రస్తావిస్తూ.. ఇరాక్ మాజీ అధ్యక్షుడు మంచివాడని ఎవరు చెప్పారు, కేవలం టెర్రరిస్టులను చంపడంలోనే ఆయన చాలా మంచివాడని తాను పేర్కొన్నట్లు వివరించారు. ప్రస్తుతం ఇరాక్ లో టెర్రరిజం రావడానికి గతంలో ఒబామా తీసుకున్న చర్యలే అని చెప్పాడు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more