తన రిటైర్మెంట్కు ముందు ఓ సీనియర్ ఐపీఎస్ అధికారికి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నుంచి ఊహించని కాల్ వచ్చింది. ఢిల్లీ పోలీసు కమిషనర్గా మరికొన్ని రోజుల్లో పదవీ విరమణ చేస్తారనగా.. నీరజ్కుమార్ ఓరోజు దావూద్ నుంచి ఫోన్ కాల్ అందుకున్నారు. 'క్యా సాహెబ్, ఆప్ రిటైర్ హోనే జారేహే హో. ఆబ్ తో పీచ్చా ఛోడ్ దో' (ఏంటీ సర్ ఇది. మరికొన్ని రోజుల్లో రిటైర్ అవ్వబోతున్నారు. ఇప్పటికైనా నన్ను వెంటాడటం మానుకోండి) అంటూ దావూద్ కోరాడు. 2013 జూన్ మొదటి వారంలో ఈ ఘటన జరిగింది.
'ఒక రోజు నా పర్సనల్ మొబైల్కు ఓ గుర్తుతెలియని నెంబర్ నుంచి కాల్ వచ్చింది. అది బహుశా దావూద్ వ్యక్తిగత నెంబర్ ఉంటుంది' అని నీరజ్కుమార్ ఈ ఫోన్కాల్ గురించి వివరించారు 'మై కన్వర్సెషన్స్ విత్ దావూద్ ఇబ్రహీం' పేరుతో ఆయన రాసిన తాజా పుస్తకంలో 'డయల్ డీ ఫర్ డాన్' అధ్యాయంలో ఈ విషయాన్ని వెల్లడించారు. తన వృత్తిజీవితంలో నిర్వహించిన 11 టాప్ ఆపరేషన్స్ గురించి వివరిస్తూ నీరజ్కుమార్ ఈ పుస్తకం రాశారు. ఈ ఆపరేషన్లన్నీ అండర్ వరల్డ్, 1993 ముంబై వరుస పేలుళ్లు, దేశవ్యాప్తంగా నేరగ్యాంగుల చుట్టే తిరుగుతాయి. ఎన్నో ఆసక్తికర అంశాలున్న ఈ పుస్తకం త్వరలోనే పెంగ్విన్ బుక్స్ విడుదల చేయనుంది.
ఉగ్రవాదుల చర్యల్లో అత్యంత హేయమైనదిగా భావించే 9/11 దాడికి భారత్ నుంచి నిధులు వెళ్లాయని కూడా ఆయన తన పుస్తకంలో పేర్కోన్నారు.. పేలుడు పదార్థాల తయారీ, విమానాల హైజాక్ నుంచి ట్విన్ టవర్స్ కూల్చివేత వరకు పథకాన్ని పక్కాగా అమలుపర్చేందుకు ఉగ్రవాదులు ఖర్చు చేసిన డబ్బులో కొంత భారత్ నుంచి సమకూరిందన్నారు. కోల్కతాలోని అమెరికన్ సెంటర్ పై దాడి (జనవరి 2, 2002) కేసులో ఉరిశిక్ష పడిన దోషి, ప్రస్తుతం జైలులో ఉంటోన్న అఫ్తాబ్ అన్సారీ.. తన గ్యాంగ్తో కలిసి 2001లో ఖాదీమ్ వ్యాపార సంస్థల అధిపతి పార్థా ప్రతిమ్ రాయ్ బర్మన్ను కిడ్నాప్ చేశాడు. బాధితుడ్ని విడిచిపెట్టే క్రమంలో భారీగా సొమ్ము చేతులు మారింది. అప్పటికే దుబాయ్ నేర సామ్రాజ్యాధిపతులు, పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థల నాయకులతో సంబంధాలున్న అఫ్తాబ్.. బర్మన్ కిడ్నాప్ ద్వారా లభించిన సొమ్ములో కొంత భాగాన్ని షేక్ ఒమర్ కు పంపాడని ఆయన పుస్తకంలో రాశారు
ఇంతకీ షేక్ ఓమర్ ఎవరంటే.. 1999 కాందహార్ విమాన హైజాక్ ఉదంతంలో భారత్ విడిచిపెట్టిన ఉగ్రవాదుల్లో ఒకడు షేక్ ఒమర్. సొంత సంస్థ హర్కత్ ఉల్ ముజాహిద్దీన్ తోపాటు తాలిబన్లతో కలిసి కార్యకలాపాలు నిర్వహించేవాడు. ప్రస్తుతం పాక్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇతను మొహమ్మద్ అట్టాకు అత్యంత నమ్మకస్తుడు. ఈ అట్టాయే 9/11 దాడుల కీలక సూత్రధారి. ఒమర్ కు... అన్సారీ నమ్మినబంటు కావడంతో అడిగిందే తడవుగా తన దగ్గరున్న డబ్బును పాక్ కు చేరవేశాడు . అలా ఆ సొమ్ము ట్విన్ టవర్స్ కూల్చివేతకు వినియోగించారు. దాడుల అనంతరం అట్టాను ఎఫ్ బీఐ అరెస్టు చేసింది. విచారణ సందర్భంగా స్వయంగా అట్టాయే ఈ విషయాలు వెల్లడించాడని, ఆమేరకు ఎఫ్ బీఐ అధికారి జాన్ పిస్టోల్ తన రిపోర్టులో అట్టా వాగ్మూలాన్ని నమోదుచేశారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more