ఆపసోపాలు పడైనా సరే పుష్కరాలకు వెళ్లి పుష్కర స్నానం చెయ్యాలని అనుకున్న భక్తులకు రెండు తెలుగు రాష్ట్రాలు సర్ ఛార్జీల మోత మోగిస్తున్నాయి. అయితే సర్వత్రా సర్ ఛార్జీల మీద నిరసన వ్యక్తం కావడంతో ఏపి సర్కార్ ర్ చార్జీలపై వెనక్కి తగ్గింది. పుష్కరాల కోసం ప్రత్యేకంగా నడుపుతున్న బస్సులలో అవనపు చార్జీలను వసూలు చేయకూడదని ఏపి ప్రభుత్వం నిర్ణయించడం భక్తులకు ఊరటనిస్తోంది. ఏపి ప్రభుత్వం నిర్ణయాన్ని ఏపీఎస్ఆర్టిసి ఎండి సాంబశివరావు వెల్లడించారు. ప్రయాణికుల నుంచి ఎట్టి పరిస్థితుల్లో అదనపు చార్జీలు వసూలు చేయవద్దని చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ చార్జీలనే వసూలు చేయనున్నట్లు ఎండీ ప్రకటించారు.
Also Read: తెలంగాణ పుష్కరాలకు నీటి కటకట
కాగా తెలంగాణలో మాత్రం పుష్కర భక్తులపై అదనపు ఛార్జీల బాదుడు కొనసాగుతోంది. ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలను వసూలు చేయాలని టీఎస్ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. తెలంగాణ ప్రభుత్వం హిందువుల మనోభాలను దెబ్బతీస్తోందని, పుష్కరాల బస్సుల్లో సర్ చార్జీల పేరుతో దోపిడీకి పాల్పడుతోందని, తెలంగాణ ప్రభుత్వం హిందూ పండుగలంటే వివక్ష చూపుతోంది అని బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు డాక్టర్ లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీసీ బస్సుల్లో సర్చార్జీ వసూలుకు నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్ భవన్ వద్ద ధర్నా నిర్వహించారు. రంజాన్ పండుగకు కోట్లాది రూపాయలు కేటాయించిన తెలంగాణ ప్రభుత్వం పుష్కారాలకు ఏర్పాటు చేసిన బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేయడం లౌకిక విధానమా అని ఎమ్మెల్సీ రామచంద్రరావు ప్రశ్నించారు. ఒక వర్గం వారికి రాయితీ ఇచ్చి, మరో వర్గంపై భారం మోపడం ఏమిటని ప్రశ్నించారు. నేటి నుండి ప్రారంభమైన గోదావరి పుష్కరాలు ఈ నెల 25 వరకు కొనసాగుతాయి.
Also Read: మా తల్లి గోదారి పిలుస్తోెంది
Also Read: వైభవంగా ప్రారంభమైన గోదావరి పుష్కరాలు
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more