కృష్ణా జిల్లా నందిగామాలో కలకలం రేగింది. నందిగామాలోని హనుమంతపాలెంలో దుండగులు గన్ చూపి బంగారాన్ని దోచుకున్నారన్న వార్తలో విజయవాడ పోలీసులు అప్రమత్తం అయ్యారు. నల్గొండ జిల్లాలో పోలీసులు మరణానికి మరికోందరు పోలీసు అధికారుల గాయాలకు కారణమైన సెమీ ఉగ్రవాదులలో మిగిలిన ముగ్గురు ఉగ్రవాదులు వీళ్లేనా అన్న కోణంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు అక్కడే మట్టుబెట్టడంతో మిగిలిన ముగ్గరు పారిపోతూ ఇలా దోపిడీలకు పాల్పడ్డారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా వున్నాయి.. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళుతున్న సురేష్ కుమార్ అనే వ్యాపారిని సోమవారం ఉదయం ఓ వ్యక్తి గొల్లపూడి వద్ద లిప్ట్ అడిగాడు. కోదాడలో దిగిపోతానని చెప్పటంతో లిప్ట్ ఇచ్చాడు. నందిగామ మండలం హనుమంతపాలెం సమీపంలో ఆ వ్యక్తి తన వద్ద ఉన్న తుపాకీతో వ్యాపారిని బెదిరించి 3 బంగారపు ఉంగరాలు, గొలుసుతో పాటు నగదు దోచుకున్నాడు. అంతేకాకుండా ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ సెల్ఫోన్లో వ్యాపారి ఫోటో తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటనతో భయభ్రాంతులకు గురైన వ్యాపారి నందిగామ డీఎస్పీ రాదేశ్ మురళికి ఫిర్యాదు చేశాడు. దుండగులు నందిగామ- జగయ్యపేట హైవే వైపు పోలాల్లోకి పరిగెట్టి వెళ్లాడని బాధితుడు పోలీసులకు సమాచారం అందించడంతో.. ఈ హైవేపై ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. పలు పెట్రోలింగ్ టీమ్ లు కూడా రంగంలోకి దిగి క్షుణ్ణంగా ఆయా ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి.
నల్గొండ జిల్లాలో సెమీ ఉద్రవాదులు చేసిన ఘటనలు వెలుగులోకి రావడంతో.. దోపిడి దోంగలు ఇలా దారిదోపిడీకి పాల్పడ్డారా..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీంతో పాటు నల్గోండ జిల్లాలో మిగిలిన సెమీ ఉగ్రవాదులు నక్కినట్టు పోలీసుల బావించి జిల్లా యావత్తు జల్లెడ పడుతున్న నేపథ్యంలో కృష్ణా జిల్లాలోని సదరు ఉగ్రవాద సంస్థకు చెందిన వారు పోలీసులు దృష్టి మరల్చడానికే ఇలాంటి ఘటనలకు పాల్పడి వుంటారా..? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more