భారత్ దేశ వ్యాప్తంగా మాయదారి మహమ్మారి రోగం స్వైన్ ఫ్లూ కలకలం రేపుతోంది. దక్షిణాఫ్రికాలో ఎబోలా వైరస్ తరహాలో ఈ వ్యాధి దేశంలో తన ప్రభావాన్ని చూపుతోంది. ఈ వ్యాధి బారిన పడి ఈ గత రెండు రోజుల్లో మరో 31 మంది ప్రజలు ప్రాణాలను విడిచారు. శీతాకాలంలో అధికంగా వ్యాపించే ఈ వ్యాధి ఇప్పటికే వందల సంఖ్యలో భారత్ వాసుల ప్రాణాలను హరించింది. మరెందరో దేశీయులను తన బాధితులుగా మార్చుకుంది. ఈ వ్యాధి బారిన పడి దేశ వ్యాప్తంగా ఇప్పటికే 774 మంది ప్రాణాలను విడువగా, సుమారు 13 వేల మంది దీని బారిన పడి చికిత్స పోందుతున్నారు.
కేంద్ర ఆరోగ్య శాఖ వెలువరించిన వివరాల ప్రకారం ఫిబ్రవరి మాసంలో మొత్తం 12 వేల 983 మంది హెచ్ వన్, ఎన్ వన్ వైరస్ భారిన పడ్డారని తెలిపింది. ఈ వ్యాధికి సంబంధించిన మందులు అందుబాటులో లేకపోవడంతో పాటు.. అస్పత్రులలో వార్డలు సంఖ్య కూడా పెద్దగా లేకపోవడంతో ప్రజలు ప్రాణాలను హరిస్తున్నాయని తెలిపింది. గత 19న కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణంకాల ప్రకారం 743 మంది ఫిబ్రవరి వరకు రోగం బారిన పడి ప్రాణాలను వదిలారు. కాగా అప్పటి వరకు 11 వేల 955 మందికి ఈ వ్యాధి సోకింది. కాగా విస్తృతంగా విజృంభిస్తున్న ఈ వ్యాధి గత రెండు రోజుల్లోనే సుమారు వెయ్యి మందికి సోకగా, దీని బారిన పడి ఈ రెండు రోజుల్లోనే 31 మంది ప్రాణాలను హరించారు.
తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో 25 స్వన్ ఫ్లూ కేసులు నమోదు కాగా, మొత్తంగా 190 మంది దీని బారిన పడి చికిత్స పోందుతున్నారు. తాజా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి జేపీ నడ్డా సమీక్షించారు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు అన్ని విధాలుగా వైద్య సేవలను అందిస్తామని హామి ఇచ్చారు. కొంత మంది వ్యాధి గ్రస్తులను పరీక్షించి అధ్యయనం చేయాల్సిందిగా, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసర్చ్ నిపుణులను కూడా ఆయన అదేశించారు. మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించాలని కోరారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more