Gannavaram air portgif

gannavaram airport, vijayawada, no security, no security in gannavaram airport

no security in gannavaram airport

Gannavaram-Air-port.gif

Posted: 02/26/2013 04:57 PM IST
Gannavaram air portgif

 no security in gannavaram airport

నిత్యం వందల మంది ప్రయూణికులు.. భారీ విమానాలు... వీఐపీలు, ప్రజాప్రతినిధులతో సందడిగా ఉండే గన్నవరం విమానాశ్రయ భద్రత ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ పేలుళ్ల నేపథ్యంలో మన విమానాశ్రయం భద్రత విషయంలోకి వెళితే.. ఎన్నో ప్రశ్నలు మదిని తొలిచేస్తారుు. ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నయ్ వంటి మహానగరాలకు నిత్యం వందల సంఖ్యలో ప్రయూణికులు రాకపోకలు సాగించే ఇక్కడ కనీస భద్రతా ఏర్పాట్లు కనిపించవు. దాదాపు 800 ఎకరాల్లో విస్తరించి ఉన్న విమానాశ్రయూనికి 40మంది సాధారణ పోలీసులే దిక్కు.నిబంధనల ప్రకారం ఎయిర్‌పోర్టులో సీఐఎస్‌ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యురిటీ ఫోర్స్ )ను నియమించాలి. అయితే, ఒక సీఐ, 40 మంది సివిల్, ఏఆర్ గార్డులే రాత్రింబవళ్లు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఎడారిని తల పించే ఎరుుర్‌పోర్టులో ఏ సమయంలో ఎటు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందో తెలి యని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ వీఐపీల తాకిడి అధికంగా ఉంటుందని, తాము సెక్యూరిటీ ఇవ్వలేమని పోలీసులు ఎయిర్‌పోర్టు అథారిటీకి మొత్తుకుంటున్నా ఫలితం లేదు.నాలుగు జిల్లాల ప్రజలకు ఉపయోగపడే విమానాశ్రయంలో ఆగంతకులు లోపలకు ప్రవేశిస్తే గుర్తించటానికి కనీసం ఒక్క సీసీ కెమెరా కూడా లేదు. పొలాల మాటు నుంచి ఆకతాయిలు ప్రవేశించి జూదం ఆడుతున్నా చర్యలు శూన్యం.

 no security in gannavaram airport

సెక్యూరిటీ, సీసీ కెమెరాల విషయమై పోలీసు, ఎయిర్‌పోర్టు అధికారులు నాలుగేళ్లుగా ఎయిర్‌పోర్టు అథారిటీకి లేఖలు రాస్తున్నా చర్యలు తీసుకోవట్లేదు.విమానాశ్రయంలో పగిలిన ప్రహరీ నుంచి ఇటీవల ఒక వ్యక్తి లోపలకు ప్రవేశించి పోలీసులకు పట్టుబడ్డాడు. ఇక్కడి చాలా గోడల పరిస్థితి ఇదే. ఫెన్సింగ్ కొంత భాగమే ఉండటంతో ఆగంతకులు తేలిగ్గా లోపలికి ప్రవేశించే వీలు కలుగుతోంది. పెట్రోలింగ్ ట్రాక్ నిర్మాణం మరుగున పడింది. వీటన్నింటిపై ప్రతి మూడు నెలలకోసారి ఎయిర్‌పోర్టు, రెవెన్యూ, పోలీస్ అధికారులు సమావేశమై సమీక్షలు నిర్వహించి పైఅధికారులకు ప్రతిపాదనలు పంపుతున్నా ఏమాత్రం ప్రయోజనం కనిపించడం లేదు.గన్నవరం వినాశ్రయానికి రోజూ ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు నుంచి నాలుగు విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. దాదాపు 700 మంది, ఆపైనే ప్రయాణికులు వచ్చి వెళ్తుంటారు. విజయవాడ-గుంటూరు నగరాలకు సమీపంలో ఉన్న విమానాశ్రయూనికి ఎన్‌ఆర్‌ఐలు, విదేశీయులు, వీఐపీలు ఎక్కువగా వస్తుంటారు. సీఎం, గవర్నర్, స్పీకర్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితర వీఐపీలు తరచూ పర్యటనలు చేస్తుంటారు. ఇంత ప్రాధాన్యత గల విమానాశ్రయంలో భద్రతకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవటంపై ప్రయూణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Political leaders comment on railway budget
Ap cloth merchants bandh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more