మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని కోరుతూ ఈరోజు మున్సిపల్ కార్మికులు రోడెక్కారు.
రెండున్నర సంవత్సరాల నుండి మూడు నెలలకొకసారి జీతాలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ దగ్గర డబ్బులు లేకపోయేసరికి పస్తులు పడుకోవాల్సిన ఆగత్యం ఏర్పడుతోందని వాపోతున్నారు. పండుగలు దగ్గర పడుతున్నాయని, చేతిలో మాత్రం చిల్లిగవ్వ లేదని వాపోతున్నారు. బకాయి పడిన వేతనాలను వెంటనే ఇవ్వాలని కార్మికులు కోరుతున్నారు. లేనిపక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. మరి అధికారులు స్పందిస్తారంటారా ?
ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ
ప్రతి జిల్లాలోనూ ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు రాష్ట్ర వైద్య విద్య శాఖ మంత్రి కొండ్రు మురళి చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం వైద్య సేవలకు 6500 కోట్ల రూపాయలు కేటాయించినట్టు మంత్రి తెలిపారు. ఇందులో ప్రభుత్వ ఆస్పత్రులకు మందుల కొనుగోలు కోసం 300 కోట్ల రూపాయిలు ఖర్చు చేసినట్టు వివరించారు. మంత్రి విజయవాడలోని మున్సిపల్ మహిళా ఆస్పత్రిని తనిఖీ చేశారు.
ఆరోగ్యశ్రీ పథకం కింద 70 లక్షల కుటుంబాలు లబ్ది పొందుతున్నట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగలందరూ ఉచిత వైద్యం పొందేందుకు హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మురళి తెలిపారు. ఈ పథకాన్ని న్యాయవాదులు, ఇతర వర్గాల వారికి విస్తరించనున్నట్టు చెప్పారు. నగరంలో 290 కోట్ల రూపాయల వ్యయంతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేయనున్నట్టు మురళి తెలిపాడు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more
Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more
Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more
Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్కు ఏపీఎన్జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్జీవోల భవన్లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more
Nov 28 | తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు సరికొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. జిల్లా పార్టీ కార్యాలయంలో సమావేశంలో ఉమా మాట్లాడుతూ, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రల మధ్య చిచ్చుపెట్టే... Read more