Cm kiran fire on congress high command

cm kiran fire on congress high command, CM Kiran Kumar Reddy, Nallari Kiran Kumar Reddy, Congress High Command, Telangana bill,

cm kiran fire on congress high command

ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

Posted: 12/07/2013 07:36 PM IST
Cm kiran fire on congress high command

ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్ కుమార్ రెడ్డి తాము ఎలాగైనా రాష్ట్ర విభ జనను అడ్డుకుని తీరతామని గట్టిగా హెచ్చరించారు. రాష్ట్రం గనుక ఒకటిగా లేకుంటే నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కట్టుకుని ఉండగలిగేవారిమా అని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టులవల్ల అటు ఆంధ్ర ప్రాంతానికి, ఇటు తెలంగాణ ప్రాంతానికి కూడా ఎంతో మేలు చేసిందని ఆయన పార్టీ కేంద్ర నాయకత్వానికి గుర్తు చేశారు. రాష్ట్ర విభజనకు తాము సహకరించమని గట్టిగా చెబుతున్నాం అని సభికుల చప్పట్ల మధ్య కిరణ్ గట్టిగా చెప్పారు.

 

విభజన నిర్ణయం తప్పు అని ఎత్తి చూపుతూ ఏ ప్రాజెక్టు వల్ల ఏ ప్రాంతానికి ఎంత లాభమో, విభజన వల్ల తెలంగాణకు సైతం ఎంత నష్టమో ఆయన వివరించారు. ఇన్ని తప్పులున్నప్పుడు ఒక్కసారి అన్నిటినీ సరిచూసుకుని ఇప్పటికైనా నిర్ణయాన్ని మార్చుకుంటే ఇక్కడున్న ప్రజలు అందరూ సంతోషిస్తారు. విభజన బిల్లును ఖచ్చితంగా ఓడిస్తాం, ఓడిపోయిన బిల్లును పార్లమెంటులో ఎలా ఆమోదిస్తారో చూస్తాం అని కిరణ్ హెచ్చరించారు.

 

కేసీఆర్ అడిగారనో, జగన్ కలుస్తారనో, చంద్రబాబు నాయుడు లేఖ ఇచ్చారనో రాష్ట్రాన్ని విభజిస్తారా? కావాలంటే వారిని కలుపుకోండి, ముఖ్యమంత్రిని చేయండి, రాష్ట్రాన్ని మాత్రం సమైక్యంగానే ఉంచండి అని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్ర ప్రదేశ్ విభజన ముసాయిదా బిల్లులో రాజ్యాంగానికి సంబంధించి చాలా ఇబ్బందులు ఉన్నాయని పత్రికలలో వస్తున్నాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. డిసెంబర్ 21, 1972 లో పార్లమెంటులో ఇందిరా గాంధి ఏం చెప్పారో ఒక్కసారి చదువుకోండి.

 

అది చదివితే రాష్ట్రాన్ని విభజించాలని ఎవ్వరూ కోరుకోరు. అందుకే చెబుతున్నా విభజనకు వ్యతిరేకమని అని ఆయన పునరుద్ఘాటించారు. ఇప్పుడు విడిపోవడంవల్ల తెలంగాణా కూడా ఇబ్బందులకు గురవుతుందని ఆయన హెచ్చరించారు. విభ జనతో నీళ్లు ఎవరికీ చెందకుండాపోతాయని ఆయన హెచ్చరించారు. అందుకే ఆ రోజున ఇందిరా గాంధి అన్ని ప్రాంతాలకూ గట్టిగా ముడి పెట్టారని, దాన్ని విడదీయడం అంత తేలిక కాదని ఆయన చెప్పారు. అందుకే అన్ని అంశాలనూ దృష్టిలో ఉంచుకుని ఒక్కసారి అందరూ ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

 

1994లో కాంగ్రెస్ పార్టీకి 25 సీట్లు కూడా లేవు, మేమంతా ఓడిపోయాం- ఒక్క కన్నా తప్ప. మీ సహాయంతో, ప్రజల అండదండలతో మళ్లీ గెలిచాం అని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ ఆంధ్ర ప్రదేశ్‌లో ఇంత పెద్ద ఉద్యమం జరిగింది, తనకు తెలిసి భారతదేశంలో ఇంత పెద్ద ఉద్యమం జరగలేదని ఆయన అన్నారు. ఇది మనందరికీ కనిపిస్తున్నది, కాని ఢిల్లీ పెద్దలకు కనిపించలేదు, వారు కళ్లు మూసుకున్నారు, చెవులు మూసుకున్నారు అని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఏం పాపం చేశామని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతున్నారని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇబ్బందులలో ఉన్నా అన్ని సీట్లూ కట్టకట్టి ఇచ్చాం. కాంగ్రెస్ పార్టీకి ఇంత బలం ఉంటే ఇప్పుడు చేజేతులా నాశనం చేసుకున్నారని ఆయన విరుచుకుపడ్డారు.

 

ఇటీవల బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ ఈ ట్రిబ్యునల్ తీర్పు అంటే అంటే సుప్రీం కోర్టుతో సమానం. మరి ఇప్పుడు నీటి సమస్యపై ఉమ్మడి బోర్డులు అంటున్నారు. ఇది రాజ్యాంగ వ్యతిరేకం అని ఆయన అన్నారు. ఇటువంటివే ఉద్యోగాల విషయంలోగాని, విద్యా అవకాశాల విషయంలో గాని చాలా లొసుగులు ఉన్నాయని ఆయన చెప్పారు. సమైక్య ఆంధ్ర మా నినాదం కాదు, విధానం అంటూ సభకు హాజరైన ప్రజలచేత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్రకు జై కొట్టించి ఆయన సభను ముగించారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more

  • Devineni uma demand

    దేవినేని ఉమా సరికొత్త డిమాండ్ ?

    Nov 28 | తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు సరికొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. జిల్లా పార్టీ కార్యాలయంలో సమావేశంలో ఉమా మాట్లాడుతూ, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రల మధ్య చిచ్చుపెట్టే... Read more