రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్కు ఏపీఎన్జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్జీవోల భవన్లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్బాబు మాట్లాడారు. సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీల చేతకానితనం వల్లే విభజన పక్రియ ముందుకు వెళుతుందన్నారు. వీరికి రానున్న ఎన్నికల్లో రాజకీయ సమాధి కడతామని హెచ్చరించారు. విభజనపై కేంద్ర ప్రభుత్వం తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.
ఈ సారి ఉద్యమం తీవ్రస్థాయిలో ఉంటుందని హెచ్చరించారు. రాజ్యాంగ సవరణ లేకుండా 371-డిని ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. బిల్లుకు వ్యతిరేకంగా అన్ని రాజకీయపార్టీలను ఏకం చేస్తామన్నారు. కేంద్ర కేబినెట్ ఆమోదించినంత మాత్రాన తెలంగాణ వచ్చినట్లు కాదని తెలిపారు. ఎమ్మెల్యేలు ఇచ్చిన మాటను అసెంబ్లీకి బిల్లు వచ్చిన సమయంలో నిలబెట్టుకోవాలని కోరారు.
రాజకీయ దురుద్దేశాలతోనే విభజన చేస్తున్నారని స్పష్టమవుతుందన్నారు. ముసాయిదా బిల్లు అసెంబ్లిdకి వస్తే ముట్టడించడమా లేక సీమాంధ్రను దిగ్బంధంచడమో ఈ నెల 9న నిర్ణయిస్తామన్నారు. కేంద్ర కేబినెట్ నిర్ణయం పూర్తిగా దురుద్దేశాలతో కూడుకుందని సీమాంధ్రులను ఈ నిర్ణయం ఎంతో బాధిస్తుందన్నారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more
Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more
Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more
Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more
Nov 28 | తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు సరికొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. జిల్లా పార్టీ కార్యాలయంలో సమావేశంలో ఉమా మాట్లాడుతూ, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రల మధ్య చిచ్చుపెట్టే... Read more