సీఎం కేసీఆర్ తనయ, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అప్పుడప్పుడు కొన్ని సంచలన వ్యాఖ్యానలు సంధిస్తూ వార్తల్లో నిలిచిపోతుంటారు. ఆమధ్య పాకిస్తాన్, తెలంగాణాలపై తనదైన రీతిలో కామెంట్లు చేసి, జాతీయ మీడియాలో ఎక్కిన విషయం తెలిసిందే! దాంతో దేశం మొత్తం మీద ఆమె పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత ఆమె తాను చెప్పిన కామెంట్లకు సర్దుబాటు చెప్పుకుంది. అంతేకాదు.. టీడీపీ పార్టీ మీద కూడా తీవ్ర విమర్శలు గుప్పిస్తూ వుంటారు. ఇప్పుడు తాజాగా తనదైన రీతిలో తెలంగాణ ప్రజలకు కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘‘ప్రజలు సుఖంగా వుండాలంటే..’’ అంటూ ప్రసంగం ప్రారంభించిన ఆమె.. మరిన్ని వ్యాఖ్యానాలు చేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన ఆమె.. మొదట బెల్లంపల్లిలో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమాలోపాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
* తెలంగాణ ప్రజలు సంతోషంగా వుండాలంటే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో వుండాలని ఆమె ఆకాంక్షించారు.
* రాష్ట్ర ప్రజలకు గులాబీ కండువా శ్రీరామరక్ష వంటిదని ఆమె పేర్కొన్నారు.
* బొగ్గు గని కార్మికుల కష్టాలు తీరుస్తామని, వారి సమస్యలు ఖచ్చితంగా పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు.
అనంతరం ఆ జిల్లాలోనే ఆసిఫాబాద్’లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కవిత ఆవిష్కరించి, రోడ్ షో నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే సభ్యత్వ నమోదు ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఆమె ప్రసంగిస్తూ...
* ఏపీ సీఎం తెలంగాణ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించబోమని అన్నారు.
* సీమాంధ్ర రాజకీయాలు తెలంగాణలో వద్దని ఆమె ప్రజలతో పేర్కొన్నారు.
* ఏపీ సీఎం తమ వ్యవహారాలు తమ రాష్ట్రంలోనే చూసుకుంటే మంచిదని హితువు పలికారు.
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more