ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్ విగ్రహాలను పరిరక్షించేందుకు పోలీసులను నియమించాల్సిన అవసరం లేదు. వాటిని తాము కాపాడుకోగలమని ఆయన అంటున్నారు. కావేరీ నిర్వహణ బోర్డు ఏర్పాటు అంశాన్ని పక్కదోవ పట్టించేందుకే ఈ పని చేస్తున్నారంటూ ఆయన సంచలన ప్రకటన చేశారు.
తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో పెరియార్ రామస్వామి విగ్రహాన్ని బీజేపీ కార్యకర్తలు కొందరు గత రాత్రి కూల్చివేసిన విషయం తెలిసిందే. దీనిపై ఈ ఉదయం మీడియాతో కమల్ స్పందిస్తూ.. పెరియార్ విగ్రహాల ధ్వంసాన్ని ద్రవిడ జాతి క్షమించజాలదని ఆయన పేర్కొన్నారు. పెరియార్ విగ్రహాలపై వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బీజేపీ జాతీయ కార్యదర్శి రాజాపై చర్యలు అవసరం లేదని అనడం ప్రభుత్వ హేయమైన చర్య అంటూ మండిపడ్డారు.
రాజా క్షమాపణలు కూడా అంగీకరించకూడదని, ఇది క్షమించరాని నేరమని అన్నారు. బీజేపీ ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. పెరియార్ విగ్రహాలను తాము కాపాడుకోగలమని, కానీ పెరియార్పై అటువంటి ఆలోచన వచ్చినా ద్రవిడ జాతి క్షమించబోదని పేర్కొన్నారు. కావేరీ నదీ జలాల అంశంపై దృష్టి మళ్లించేందుకే పెరియార్ విగ్రహాల అంశాన్ని తెరపైకి తెచ్చినట్టు ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్ రాజా.. పెరియార్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వెల్లూరులోని ఆయన విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. పెరియార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనకు ప్రతీకారంగా కోయంబత్తూరులోని బీజేపీ కార్యాలయంపై కొందరు పెట్రో బాంబులు విసిరారు.
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more
Dec 20 | అనంతపురం అభివృద్ధికి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అర్ధరూపాయి కూడా ఖర్చు చేయలేదని మేయర్ స్వరూప విమర్శించారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ జేసీపై మండిపడ్డారు. అనంతపురం అభివృద్ధికి అడ్డుపడుతున్న రాక్షసుడు జేసీ అని,... Read more