హార్ట్ ఎటాక్ అన్నది వైద్యపరంగా అత్యవసర పరిస్థితి. రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల గుండెకు రక్త సరఫరా నిలిచిపోయి హార్ట్ ఎటాక్ వస్తుంది. లేదా రక్తనాళాలు కుచించుకుపోయి గుండెకు రక్త సరఫరా తగినంత అందకపోయినా గానీ హార్ట్ ఎటాక్ వస్తుంది. రక్త సరఫరా నిలిచిపోవడంతో శరీరంలోని కణాలకు ఆక్సిజన్ అందదు. దీంతో ప్రాణాంతకం అవుతుంది. ప్రతి 33 సెకన్లకు ఒకరు హార్ట్ ఎటాక్ కారణంగా మన దేశంలో ప్రాణాలు కోల్పోతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఏటా 20 లక్షల మంది బలైపోతున్నారు. హార్ట్ ఎటాక్ బారిన పడుతున్న వారిలో 4 నుంచి 10 శాతం మంది 45 ఏళ్లలోపు వయసు వారుంటున్నారు.
మారిన జీవన శైలితో గుండె జబ్బుల ముప్పు పెరుగుతోంది. ఈ బాపతు ఏటా కోటి కేసులు నమోదవుతున్నాయి. చిన్న వయసులోనే హార్ట్ ఎటాక్ బారిన పడుతున్న కేసుల సంఖ్య కూడా అధికమవుతోంది. ప్రాణాలు కోల్పోతున్న వారు కూడా ఎందరో. ఇది గుండెపోటు సంకేతమే అని గుర్తించి నిమిషాల వ్యవధిలో ఆస్పత్రికి వెళ్లగలిగితే నిండు ప్రాణాన్ని నిక్షేపంగా కాపాడుకునేందుకు ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది. అందుకే గుండెపోటు లక్షణాలన్నవి తెలుసుకుని, ఆ విధమైన అవగాహనతో ఉండడం ఎంతో అవసరం.
చాతీ పట్టేసినట్టు
చాతీ భాగంలో గట్టిగా పట్టేసినట్టు ఉంటుంది. ఎక్కువ మందిలో కనిపించే ప్రథమ లక్షణం ఇది. గుండెకు సంబంధించి ఆర్టరీ పూడుకుపోయినా, హార్ట్ ఎటాక్ లోనూ చాతిలో నొప్పి, పట్టేసినట్టు, ఒత్తిడి అనిపిస్తుంది. ఒక్కొక్కరికీ ఒక్కోరకమైన అనుభవం కనిపించొచ్చు. కొందరికి గుండెపై ఏనుగు కూర్చున్నట్టు ఉంటుంది. కొందరిలో నొక్కినట్టు, కాలుతున్నట్టు భావన కలుగుతుంది. కొందరిలో చాతిలో అసౌకర్యంగానూ ఉండొచ్చు. ఇదేదో ఒకటి రెండు నిమిషాలు ఉండిపోయేది కాదు... అలా చాలా సేపు ఉంటుంది. ఏదైనా పనిచేస్తున్న సమయంలో, నిద్రలోనూ ఈ పరిస్థితి ఏర్పడవచ్చు. చాలా చిన్న నొప్పి అయి, అలా ఉన్న చోట చేతితో అదిమినప్పుడు నొప్పి పెరిగితే అది గుండెకు సంబంధించినది కాకపోవచ్చు. వైద్య పరంగా చాతీ నొప్పిని యాంజినాగా పేర్కొంటారు. సాధారణంగా కరోనరీ ఆర్టరీ వ్యాధిలో కనిపించే లక్షణం. ఇది గుండెపోటుకు దారితీస్తుంది. అప్పటి వరకూ గుండె జబ్బులు లేని వారు, ఉన్న వారు సైతం ఈ తరహా లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా ఆగమేఘాలపై ఆస్పత్రికి వెళ్లడం సేఫ్.
హార్ట్ ఎటాక్ సమయంలో కొంత మందిలో వాంతులు కావడం జరుగుతుంది. పురుషుల్లో కంటే మహిళల్లో హార్ట్ ఎటాక్ సమయంలో ఇది ఎక్కువగా కనిపించే లక్షణం. ఇక కడుపులో మంట, కడుపులో నొప్పి, అజీర్తి అన్నవి తిన్న ఆహారం సరిపడక, ఇతర జీర్ణవ్యవస్థ సంబంధిత ఇబ్బందుల వల్ల కనిపించే లక్షణాలు. కానీ గుర్తుంచుకోవాల్సిన అంశమేమిటంటే హార్ట్ ఎటాక్ సమయంలోనూ ఇవి కనిపించొచ్చు. కనుక నిర్లక్ష్యం చేయరాదు.
చేయి, భుజం నొప్పి
తల తిరగడం, తల నొప్పి
గొంతు లేదా దవడ నొప్పి
అలసట, ఆయాసం, బరువు పెరగడం
కాళ్లలో వాపు
చెమట
అదే పనిగా దగ్గు
గురక
క్రమం తప్పిన గుండె లయలు
గమనిక... ఈ లక్షణాలు స్త్రీలు, పురుషుల్లో భిన్నంగా కనిపిస్తుంటాయి.
రిస్క్ ఎక్కువ ఎవరికంటే...
కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉంటే అటువంటి వారికి రిస్క్ ఎక్కువే. అధిక కొలెస్ట్రాల్, అధిక ట్రై గ్లిజరైడ్స్, అధిక రక్తపోటు (హైపర్ టెన్షన్), మధుమేహం, క్రమం తప్పకుండా మద్యసేవనం, పొగతాగడం, పొగాకు ఉత్పత్తుల అలవాట్లు, అధిక బరువు, శారీరక శ్రమ లేని వారు, అధిక ఒత్తిడితో కూడిన పనుల్లో ఉన్నవారు, తగినంత నిద్ర, విశ్రాంతి లేని వారికి గుండె జబ్బుల ముప్పు చాలా ఎక్కువ. మహిళలతో పోలిస్తే మగవారిలో గుండె జబ్బుల రిస్క్ ఎక్కువ. ముఖ్యంగా చిన్న వయసులో గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్ బారిన పడుతున్న వారిలో పురుషులే అధికంగా ఉంటున్నారు. మహిళల్లోనూ మెనోపాజ్ తర్వాత రిస్క్ పెరుగుతోంది.
నిర్లక్ష్యం వద్దు...
పై తరహా లక్షణాల్లో ఏమున్నా గానీ, ఏం కాదులే అన్న నిర్లక్ష్యం తగదు. ముందుగా గుర్తిస్తే గుండెపోటుతో ప్రాణాపాయం తలెత్తకుండా నివారించేందుకు అవకాశం ఉంటుంది. గుండె పోటు బాధితుల్లో ఎక్కువ శాతం మందిలొ ముందుగానే హెచ్చరికగా లక్షణాలు, సంకేతాలు కనిపిస్తుంటాయి. కానీ వారు వాటిని తేలికగా తీసుకోవడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. చాలా తక్కువ శాతం కేసుల్లోనే హార్ట్ ఎటాక్ అప్పటికప్పుడు రావడం వల్ల ప్రాణాంతకమవుతున్న వారుంటున్నారు. గుండె జబ్బులు, గుండె వైఫల్యం అన్నది అప్పటికప్పుడు ఒక గంటలోనో, ఒక రోజులోనే అవ్వడం అసాధ్యం. చాలా ముందు నుంచే (కొన్ని నెలలు) పనితీరులో మార్పు వస్తుంది. అందుకే 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఏడాదికోసారి, 45 ఏళ్లు దాటిన వారు ప్రతీ ఆరు నెలలకు ఓసారి, 60 ఏళ్లు దాటిన వారు ప్రతీ మూడు నెలలకోసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో ఏ సమస్య అయినా ఆరంభంలోనే బయటపడుతుంది. దాంతో వైద్యులు చికిత్సతో నయం చేయగలరు. ప్రాణాపాయాన్ని నివారించగలరు.
మన దేశంలో గుండె వైఫ్యలం బారిన పడిన వారిలో 23 శాతం మంది బాధితులు ఏడాదిలోపే ప్రాణాలు కోల్పోతున్నారని ‘ద ఇంటర్నేషనల్ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్’ పేరుతో నిర్వహించిన ఓ సమగ్ర సర్వేలో వెల్లడైంది. నిర్లక్ష్యం చేసి గుండె వైఫల్యాన్ని తెచ్చుకుంటే ప్రాణాంతకం అవుతుందని ఈ ఫలితాలు తెలియజేస్తున్నాయి. అందుకే సమస్య తొలినాళ్లలోనే వైద్యులను సంప్రదించడం వల్ల వారు మందులు, జీవన విధానం, ఆహారంలో మార్పులు సూచిస్తారు. సమస్య తీవ్రత ఉంటే ఆ సమస్య ఆధారంగా బైపాస్ సర్జరీ, ఇతర శస్త్ర చికిత్సలను సూచించే అవకాశం ఉంది.
(And get your daily news straight to your inbox)
Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more
Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more
Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more
Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more
Dec 20 | ఎనర్జీ డ్రింకులు అధికంగా తాగడం వల్ల బ్రెయిన్ హెమరేజ్ (మెదులో రక్తస్రావం) బారిన పడే అవకాశం ఉందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. అంతేకాకుండా హృద్రోగాలు, రక్తనాళాల పనితీరు మందగించడం వంటి ఆరోగ్య... Read more