టీమిండియాతో వన్డే సిరీసులో తమ జట్టు స్పిన్నర్లు అత్యంత కీలకం అవుతారని ఆసీస్ పేసుగుర్రం కమిన్స్ అన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో దుమ్ముతో కూడిన గాలులు ఎదురవ్వక పోవచ్చని అంచనా వేశాడు. ఈ నెల 14న ముంబయిలో భారత్, ఆస్ట్రేలియా తొలి వన్డేలో తలపడతాయి. 17న రాజ్కోట్, 19న బెంగళూరులో మిగతా మ్యాచులు జరుగుతాయి.
‘చివరి సిరీస్లో మేం ఇద్దరు స్పిన్నర్లతో ఆడాం. టీమిండియా సైతం ఇద్దరిని ఆడించింది. అందుకే మ్యాచుల్లో వారెంతో కీలకం. మధ్య ఓవర్లలోనైతే మరీనూ’ అని కమిన్స్ అన్నాడు. ప్రస్తుతం ఆసీస్ జట్టులో ఆస్టన్ ఆగర్, ఆడమ్ జంపా రూపంలో ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు. మార్నస్ లబుషేన్ సైతం పార్ట్టైం స్పిన్నర్గా సాయపడతాడు. ఉపఖండం పిచ్ల గురించి అతడు మాట్లాడాడు.
ఆట సాగే కొద్దీ బంతి ఎక్కువ నునుపు అవుతుందని కమిన్స్ అభిప్రాయపడ్డాడు. అందుకే ఇతర దేశాలతో పోలిస్తే బౌలింగ్ చేయడం అత్యంత సులభమని పేర్కొన్నాడు. చిన్నవి, వేగవంతమైన మైదానాలు కాబట్టి కొన్ని సవాళ్లూ ఎదురవుతాయన్నాడు. ‘కొత్త బంతి ముందుభాగం ఎక్కడైనా ఒకేలా ఉంటుంది. ఆటసాగే కొద్దీ బంతి ఎక్కువ నునుపు అవుతుంది. అందుకే ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ సులభంగా బౌలింగ్ చేయొచ్చు. ఆస్ట్రేలియాతో పోలిస్తే ఉపఖండం మైదానాలు చిన్నవి, వేగవంతమైనవి. కాబట్టి కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. బంతితో ఎక్కువ వేగం, బౌన్స్ రాబట్టడం కాస్త కష్టం’ అని కమిన్స్ తెలిపాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more