క్రికెట్ నుంచి ఇటీవల వీడ్కోలు తీసుకున్న టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ఈ ఏడాది జూలైలో ఇంగ్లాండ్ పర్యటనకి వెళ్లిన టీమిండియా ఐదు టెస్టుల సిరీస్ ను 1-4తో చేజార్చుకున్నా విషయం తెలిసిందే. అయితే గత 15ఏళ్లలో విదేశీ గడ్డపై అత్యుత్తమంగా రాణిస్తున్న భారత్ జట్టు ఇదే అంటూ రవిశాస్త్రి అప్పట్లో బాహాటంగా ప్రకటించాడు. ఈ ప్రకటనపై పలువురు సీనియర్లు రుసరుసలాడారు.
తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో గౌతమ్ గంభీర్ ముందు రవిశాస్త్రి అప్పట్లో చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించగా.. అతను ఒక్క మాటలో తేల్చిపారేశాడు. ‘కెరీర్లో ఎలాంటి గెలుపు అందుకోలేని వారే ఇలా మాట్లాడతారని రవిశాస్త్రీని పరోక్షంగా విమర్శించారు. రవిశాస్త్రి అతని కెరీర్ లో సాధించింది ఏంటో..? తనకు తెలీదు’ అని గంభీర్ వ్యంగ్యంగా స్పందించాడు. ఈ ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికా పర్యటనకి వెళ్లిన భారత్ జట్టు మూడు టెస్టుల సిరీస్ని 1-2తో చేజార్చుకుంది.
అయినప్పటికీ ఇదే బెస్ట్ టీమ్ అని రవిశాస్త్రీ ఎలా అంటాడంటూ గంభీర్ మండిపడ్డాడు. తాజాగా ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్లిన భారత్ జట్టు.. అడిలైడ్ వేదికగా గత సోమవారం ముగిసిన తొలి టెస్టులో 31 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్లో.. అదీ తొలి టెస్టులో భారత్ జట్టు గెలుపొందడం సుదీర్ఘ చరిత్రలో ఇదే తొలిసారి..!
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more