ధోని ఫామ్ లోకి వస్తేనే టీమిండియాకు మేలుభారత క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనిని వెస్టిండీస్ తో టీ20 సిరీస్ కు ఎంపిక చేయకపోవడం తనకు ఏమాత్రం ఆశ్చర్యం కలిగించలేదని టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ అన్నాడు. ధోని ప్రస్తుతం ఫామ్ లో లేకపోవడంతో అతను ముందుగా ఫామ్ లోకి రావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డాడు. 2019 వన్డే ప్రపంచకప్ లో ధోని మంచి ప్రదర్శన చేయాలంటే ఝార్ఖండ్ రంజీ జట్టు తరఫున ఆడాలని సూచించాడు. అప్పుడే ఫామ్ కొనసాగించొచ్చని దాదా పేర్కొన్నాడు.
‘టీ20 జట్టు నుంచి ధోనీని తప్పించడం తనకేమీ ఆశ్చర్యం అనిపించలేదని గంగూలీ అన్నాడు. ఎందుకంటే అతడి ప్రదర్శన ఆశాజనకంగా లేదని పేర్కొన్నాడు. ఇలాంటి ప్రదర్శనతో 2020 టీ20 ప్రపంచకప్ వరకు మహీ కొనసాగుతాడన్న నమ్మకమూ తనకు లేదని అభిప్రాయపడ్డాడు. అందుకే సెలక్టర్లు మంచి ఫామ్లో ఉన్న రిషబ్ పంత్ కు అవకాశం ఇచ్చి వుంటారని అన్నాడు. అయితే సెలక్టర్లు ధోనీని వన్డే ప్రపంచకప్ ఆడించాలనుకుంటే మాత్రం చాలినన్ని అవకాశాలు ఇవ్వాల్సిందేనని అన్నాడు.
వెస్టిండీస్ వన్డే సిరీస్ తర్వాత మహీ దేశవాళీ మ్యాచులు ఎక్కువ ఆడేలా కనిపించడం లేదు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్ లను నేరుగానే ఆడతాడు. నిరంతర సాధన లేకుండా ఇంత అంతరంతో వన్డేలు ఆడటం చాలా కష్టం’ అని దాదా వెల్లడించాడు. ధోనీని జట్టు నుంచి తొలగించడంతో అతడి అభిమానుల నుంచి విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో 2020 టీ20 ప్రపంచకప్నకు రెండో వికెట్ కీపర్ను సిద్ధం చేసేందుకే ఎంఎస్ ధోనీకి విశ్రాంతి కల్పించామని సెలక్టర్లు మీడియాకు చెప్పిన సంగతి తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more