ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి దిగ్గజ అటగాళ్లు దూరం అవుతున్నారు. గాయాలబారిన పడిన వీరు క్రమంగా అత్యంత ఉత్కంఠభరితమైన ఆటకు దూరం కావడం అభిమానులను కలవరపాటుకు గురిచేస్తుంది. ఇప్పటికే టీమిండియా ఓపెనర్ గా అసీస్ సహా పలు జట్లపై సత్తా చాటిన కేఎల్ రాహుల్ తన భుజానికైన గాయంతో ఐపీఎల్ కు దూరం కాగా, ఇప్పుడు అదే భాటలో మరికొందరు టీమిండియా కీలక అటగాళ్లు వుండటం అభిమానుల్ని కలవరానికి గురిచేస్తుంది.
రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్(ఆర్పీఎస్) జట్టు సభ్యుడైన స్పీన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ కూడా దూరం అవుతున్నాడు. గాయం కారణంగా అశ్విన్ తాజా ఐపీఎల్-10కు దూరం కానున్నడాని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. గతేడాది ఏర్పడిన పుణే జట్టు తమ తొలి సీజన్ లో మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలో తీవ్ర నిరాశపరిచిన విషయం తెలిసిందే. అశ్విన్ సేవలు కోల్పోతే ఈ సీజన్లో జట్టు విజయాలపై ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికైతే అశ్విన్ కానీ, పుణే జట్టుగానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఆస్ట్రేలియా సిరీస్ ముగిసిన అనంతరం ముంబైలో అశ్విన్కు పరీక్షలు నిర్వహించి.. ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు అశ్విన్ విశ్రాంతి తీసుకోవాలని ఫిజియో సూచించినట్లు తెలుస్తోంది. జూన్ మాసంలో ఐసీసీ నిర్వహించే చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం వరకు పూర్తిస్థాయిలో అశ్విన్ కోలుకుని భారత జట్టుకు అందుబాటులో వుండాలంటే ఈ విశ్రాంతి తప్పదని సమాచారం. అయితే ఇందుకు కారణం హెర్నియాగా చెబుతున్నా.. ధోనికి కాకుండా మరోకరికి జట్టు పగ్గాలను అప్పగించడం కూడా కారణం అయ్యివుండవచ్చునన్న పుకార్లు సైతం షికార్లు చేస్తున్నాయి.
అటు టీమిండియా మరో ఓపెనర్ మురళీ విజయ్ కూడా తన మడమ, భుజానికి అయిన గాయాలతో ఐపీఎల్ కు దూరం కానున్నాడని సమాచారం. ఇదే జరిగితే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కీలక అటగాడిని కొల్పోయినట్లే. ఇదే క్రమంలో ఢిల్లీ ఢేర్ డెలిల్స్ జట్టు కూడా కీలక అటగాడిని దూరం చేసుకుంది. గాయం కారణంగా డీకాక్ ఐపీఎల్ కు అందుబాటులో రాలేడని డేర్ డెవిల్స్ జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రావీడ్ చెప్పారు. ఇలా కీలక అటగాళ్లందరూ ఐపీఎల్ కు దూరం కానుండడంతో అభిమానుల్లో ఆసక్తి తగ్గే ప్రమాదం కూడా లేకపోలేదన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more