ఇప్పటికే లోథా కమిటీ సిఫార్సులు, ఆపై సుప్రీం అక్షింతలతో స్వేచ్ఛను కోల్పోయామని గగ్గోలు పెడుతున్న బీసీసీఐ మరో షాకింగ్ నిర్ణయానికి సిద్ధపడినట్లు సమాచారం. కాసులు కురిపిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ రద్దు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు ఉప్పందిస్తున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తో అనవసరంగా విభేధాలు కొనితెచ్చుకోవటం మంచిది కాదని భావిస్తున్న బోర్డు ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే అది వచ్చే ఒక్క ఏడాదికి మాత్రమే సుమీ.
బీసీసీఐ మానసపుత్రిక ఐపీఎల్. భారత్ లో ఐపీఎల్ ఆరంభం తరువాత బీపీఎల్ (బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్), ఐటీపీఎల్ (ఇండియన్ టెన్నిస్ ప్రీమియర్ లీగ్), ప్రొ కబడ్డీ లీగ్, ఐఎస్ఎల్ (ఫుట్ బాల్ ఛాంపియన్స్ లీగ్) ఇలా ఎన్నో లీగులు పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. వీటన్నింటికీ ఆది గురువు ఐపీఎల్. అలాంటి ఐపీఎల్ ను బీసీసీఐ రద్దు చేసుకోనున్నట్టు తెలుస్తోంది. లోథా కమిటీ సిఫారసుల నేపథ్యంలో ప్రతి టోర్నీకి మధ్య 15 రోజుల వ్యవధి ఉండాలి. అలా లేకపోవడంతో రెండు టోర్నీల్లో ఏదో ఒకదానిలో టీమిండియా పాల్గొనాల్సి ఉంది.
ఐతే ఛాంపియన్స్ లీగ్ కూడా బీసీసీఐ రూపకల్పన చేసినదే కావడం విశేషం. ఈ నేపధ్యంలో ఐసీసీ నిర్వహించే ఛాంపియన్స్ ట్రోఫీని రద్దు చేస్తే, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తో వివాదం ఏర్పడుతుంది. ఇప్పటికే ఐసీసీతో బీసీసీఐకి చిన్నచిన్న విభేదాలు ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీకి ఇంగ్లండ్ కు విడుదల చేసిన నిధుల విషయంలో ఈ విభేదాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐసీసీతో వివాదం కంటే దేశీ టోర్నీ అయిన ఐపీఎల్ ను రద్దు చేయడమే సరైన నిర్ణయమని బీసీసీఐ భావిస్తోంది. ఇప్పటికే లోథా కమిటీతో బీసీసీఐ కోల్డ్ వార్ జరుగుతున్న నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహణ అసాధ్యంగా కనిపిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more