టీమిండియా తీరుమారలేదు.. దాంతో ఆస్ట్రేలియా సిరీస్ ను మరో రెండు మ్యాచులు ఉండగానే కైవసం చేసుకుంది. మొత్తం ఐదు మ్యాచుల సిరీస్ లో ఆస్ట్రేలియా వరుసగా మూడు మ్యాచుల్లో గెలిచి సిరీస్ ను సొంతం చేసుకుంది. మెల్ బోర్న్ లో ఈ రోజు జరిగిన వన్డే పోటీలో టీమిండియా 50 ఓవర్లలో 295 పరుగులు చేస్తే.. ఆస్ట్రేలియా 48.4 ఓవర్లలో విజయలక్ష్యమైన 296 పరుగులు సాధించింది. గతంలో జరిగిన రెండు వన్డేల కన్నా ఈ పోటీలో భారతీయ బౌలర్లు మెరుగైన ప్రతిభ ప్రదర్శించినా కానీ అపజయం టీమిండియాను వెంటాడింది. మాక్స్ వెల్ జట్టులో కీలకపాత్రవహించి చేసిన 96 పరుగులతో ఆస్ట్రేలియాకు విజయం లభించింది.
ఆస్ట్రేలియా ఓపెనర్లు ఎస్ మార్ష్ 62, ఫించ్ 21 కెప్టెన్ స్మిత్ 41 బెయిలీ23, మాక్స్ వెల్ 96, మిచెల్ మార్ష్ 17, వైడ్ 6, ఫాల్క్ నర్ 21 ( నాట్ ఔట్) చేశారు. భారత బౌలర్లు ఉమేశ్ యాదవ్ , ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. భారత జట్టులో రిషి ధావన్, గురుకీరత్ మాన్ తొలి వన్డే ఆడినా పెద్దగా ప్రతిభచూపలేకపోయారు. భారత బ్యాట్స్ మన్ లో శిఖర్ ధావన్ 68, పరుగులు చేస్తే విరాట్ కోహ్లీ 117 పరుగులు చేశాడు. వన్డేల్లో 24వ సెంచరీ చేశాడు. అతి తక్కువ సమయంలో వన్డేల్లో 7 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడుగా రికార్డులకు ఎక్కాడు. అజంక్యా రహానే 50 పరుగులు, ధోని 23 పరుగులు చేసినా మిగతా బ్యాట్స్ మన్ రాణించలేదు. ఏమైనా ఆస్ట్రేలియా సీరీన్ ను 3-0తో నెగ్గింది. ఈ మ్యాచ్ లో మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more