భారత బ్యాట్స్ మెన్ అజింక్య రహానేపై టీమిండియా క్రికెట్ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధరన్ ప్రశంసలు కురిపించారు. ప్రస్తుత తరం క్రికెటర్లలో మెరుగైన ఫీల్డర్లలో రహానే ఒకరని ఆయన ధీమాగా చెప్పారు. ఆటగాళ్ల ఫీల్డింగ్ గురించి మీడియా ఆయనను ప్రశ్నించగా.. 'దేవుడైనా కూడా పొరపాటున క్యాచ్ వదిలేస్తాడేమో కానీ రహానే అలా కాదు' అంటూ జట్టు ఆటగాడిని ప్రశంసించాడు. ఫీల్డింగ్ అనేది ఆటగాళ్లకు ఉండాల్సిన ప్రాథమిక నైపుణ్యమని శ్రీధర్ పేర్కొన్నాడు. కొన్నిసార్లు తప్పులు జరుగుతాయని వెంటనే వాటి నుంచి పాఠం నేర్చుకోవాలని ఆటగాళ్లకు సూచించాడు.
లంకతో రెండో టెస్టులో కుమార సంగక్కర క్యాచ్ వదిలేసిన రహానే.. ఆరు ఓవర్ల తర్వాత అదే ఆటగాడు ఇచ్చిన క్యాచ్నే ఒంటి చేత్తో ఒడిసిపట్టడం చూస్తే అతని ఫీల్డింగ్ ప్రతిభ అర్థమవుతోందంటూ కితాబిచ్చాడు. టీమిండియా ఆటగాళ్ల ఫీల్డింగ్ మెరుగు చేయడంపై బీసీసీఐ దృష్టిపెట్టినట్లు కనిపిస్తోందని... ఏ జట్టుకైనా ఫీల్డింగ్ కీలక అంశమని అన్నాడు. శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్లో భారత్ ఫీల్డింగ్ కొంత మెరుగైందని.. దీంతోనే లంక ఆటగాళ్లను టీమిండియా క్రికెటర్లు ఒత్తిడిలోకి నెట్టగలిగారని తాను నమ్ముతున్నట్లు చెప్పారు. శ్రీలంకతో సిరీస్ లో బాగా రాణించిన ఆటగాళ్లలో అమిత్ మిశ్రా ఒకడని శ్రీధర్ అభిప్రాయపడ్డాడు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more