టీమిండియా, బంగ్లాదేశ్ క్రికెట్ జట్ల మధ్య ఫతుల్లా వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో తొలిరోజు ఆట ముగిసింది. తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా ఆటగాళ్లు.. బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డారు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 239 పరుగులు చేసింది. ఓపెనర్లు శిఖర్ ధావన్, మురళీ విజయ్ చాకచక్యంగా ఆడుతూ భారీ స్కోరువైపు దిశగా జట్టును తీసుకెళ్లారు.
ముఖ్యంగా శిఖర్ ధావన్ అద్భుత ఇన్నింగ్స్ ప్రదర్శించాడు. మొదట్లో నిదానంగా తన ఆటను ప్రారంభించిన ధావన్.. ఆ తర్వాత దూకుడుగా ఆడాడు. టెస్టు మ్యాచులా కాకుండా వన్డే తరహాలో చెలరేగిపోయాడు. ముందుగా 47 బంతుల్లోనే అర్థసెంచరీ పూర్తి చేసుకున్న ధావన్.. ఆ తర్వాత మరింతగా బంగ్లా బౌలర్లపై చెలరేగిపోయాడు. ఇక ఆట ముగిసే సమయానికి ధావన్ 158 బంతుల్లో 150 (21 ఫోర్లు) పరుగులు చేశాడు. ఇక మురళీ విజయ్ మొదట్లో కొంచెం తడబడినా భారీ స్కోరులో తనవంతు పాత్ర పోషించాడు. ఇతగాడు 178 బంతుల్లో 89 (8 ఫోర్లు, 1 సిక్స్) పరుగులు చేశాడు.
బంగ్లాదేశ్ తన సొంత గడ్డపై భారత ఓపెనర్లకు పోటీగా బౌలింగ్ చేయలేకపోయింది. ఓపెనర్ల భాగస్వామ్యాన్ని విడదీయడానికి బంగ్లాదేశ్ ఏకంగా ఏడుగురు బౌలర్లను దించింది. శిఖర్ ధావన్ భీకరమైన బ్యాటింగ్కి బంగ్లా బౌలర్లు బెంబేలెత్తిపోయారు. టెస్ట్లోనూ ధావన్ టీ20 ఆటతీరుతో స్టేడియంలో ఉన్న ప్రేక్షకులను ఉత్సాహపరిచాడు. మ్యాచ్ జరుగుతుండగా పలుమార్లు వర్షం పడటంతో తొలి రోజు నాలుగు గంటల పాటు మ్యాచ్కు అంతరాయం ఏర్పడింది. దీంతో రెండో రోజు మ్యాచ్ను అరగంట ముందే ప్రారంభించనున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more