నటి అనుష్క, క్రికెటర్ విరాట్ కోహ్లీ మధ్య గాఢమైన ప్రేమాయణం గతకొన్నాళ్ల నుంచి కొనసాగుతున్న వ్యవహారం తెలిసిందే! వీరి ప్రేమ విషయంపై ఇన్నాళ్లూ ఏమత్రం చొరవ తీసుకుని బీసీసీఐ.. తాజాగా అనుష్క కారణంగా కోహ్లీకి బీసీసీఐ గట్టి వార్నింగే ఇచ్చింది. అదేంటీ.. గతంలో ఇంగ్లాండ్ టూర్ సందర్భంగా కోహ్లీతో అనుష్క కలిసి వెళ్లినప్పుడు పెదవి విప్పని బీసీసీఐ.. ఇప్పుడెందుకు వార్నింగ్ ఇచ్చింది? అనేగా మీ సందేహం! వారిద్దరూ వ్యక్తిగతంగా ఎలాగైనా వుండొచ్చు కానీ.. గేమ్ రూల్స్ ని అతిక్రమిస్తే మాత్రం అంతే మరీ! ఇంతకీ ఏం జరిగిందనేగా సందేహం.. అది తెలియాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే!
వివరాల్లోకి వెళ్తే.. మొన్న బెంగుళూరులో ఢిల్లీతో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే! దీంతో జట్టు ఆటగాళ్లంతా పవెలియన్ వైపు కదిలారు. ఈ సందర్భంగా బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తన డ్రెస్సింగ్ రూంకు వెళుతున్న క్రమంలో అనుష్కతో మాట్లాడాడు. అంతేకాదు.. ఆమెతో చాలా చనువుగా వుంటూ కనిపించాడు. దీనిని బీసీసీఐ తీవ్రంగా పరిగణించింది. ఎందుకంటే.. ఐసీసీ నిబంధనల ప్రకారం మ్యాచ్ జరుగుతుండగా.. జట్టు సభ్యులు, ప్రత్యర్థి జట్టు సభ్యులు మినహా బయటి వ్యక్తులతో మాట్లాడేందుకు ఆటగాళ్లకు అనుమతి లేదు. కానీ.. కోహ్లీ ఈ నిబంధనను ఉల్లంఘించి నిండు మైదానంలో అందరూ చూస్తుండగానే తన గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడటం, క్లోజ్ మూవ్ అవడం చేశాడు. అందుకే ఇతనికి బీసీసీఐ వార్నింగిచ్చిందట!
ఈ వ్యవహారంపై ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. ‘చిన్నస్వామి స్టేడియంలో వీఐపీ ఎన్ క్లోజర్, ఆటగాళ్ల డగౌట్ దగ్గరగా వుండటం వల్లే అనుష్కతో కోహ్లీ మాట్లాడగలిగాడు. విషయం తెలిసిన తర్వాత విరాట్ ను పిలిచి అనధికారికంగా వార్నింగిచ్చాను’ అని స్పష్టం చేశారు. మరి.. ఇప్పటినుంచైనా కోహ్లీ మ్యాచ్ జరుగుతున్న క్రమంలో తన గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడకుండా వుండగలడేమో చూద్దాం!
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more