దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశానుసారం త్వరలో రానున్న బీసీసీఐ అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికలకు మాజీ బీసీసీఐ అధ్యక్షుడు, ప్రస్తుత ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు శరద్ పవార్ సన్నద్ధమవుతున్నారు. శ్రీనివాసన్ ను బీసీసీఐ నుంచి తొలగించడం శుభపరిణామంగా అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించిన తరుణంలో తన స్పందనను తెలిపిన పవార్.. మరోమారు బీసీసీఐ పగ్గాలను అందుకునేందుకు బరిలో నిలవనున్నారు. 2005 నుంచి 2008 వరకూ బీసీసీఐ అధ్యక్షునిగా పవార్ పనిచేశారు. శ్రీనివాస్ తోలగింపుతో అందివచ్చిన అవకాశాన్ని మళ్లి చేజిక్కించుకునేందుక తెర వెనుక తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
మూడేళ్ల పాటు బీసీసీఐ అధ్యక్ష పదవిలో కొనసాగిన అనుభవాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకే యత్నాలు ఆరంభించారు. అయితే కోర్టు నిర్ణయంపై శ్రీనివాస్ స్పందించే తీరును పరిశీలించాకే తన నిర్ణయాన్ని పవార్ ప్రకటించే అవకాశం ఉంది. ఇందుకోసం ఫిబ్రవరి 14 వరకూ వేచి చూడాలని పవార్ యోచి చూస్తున్నారు. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసుకు సంబంధించి ఐసీసీ చైర్మన్ ఎన్. శ్రీనివాసన్ ఏదో ఒక పదవికి మాత్రమే పరిమితం కావాలని సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేయడంతో ఆయన ఏలాంటి నిర్ణయం తీసుకుంటారన్న అంశంపై స్పష్టత వచ్చిన తరువాతే పవార్ తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశాలున్నాయి. సర్వోన్నత న్యాయస్థానం జనవరి 22న వెలువరించిన తీర్పులో మరో ఆరు వారాల్లో బీసీసీఐ ఎన్నికల జరపాలని ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పుడు బీసీసీఐ అధికారులందరూ ఆ పనులలో నిమగ్నమయ్యారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more