మెల్బోర్న్ టెస్టులో నాలుగో రోజు ఆట తీరును అంచనా వేసినట్లుగానే ఫలితం తేలకుండా డ్రాగా ముగిసింది. దీంతో ఇప్పటికే రెండు టెస్టు మ్యచ్ లను తమ వశం చేసుకున్న అస్ట్రేలియా బోర్డర్-గవాస్కర్ టెస్టు సీరీస్ ను మరోసారి కైవసం చేసుకుంది. ఇవాళ భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ చివరి రోజు ఆటలో భాగంగా 384 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ధోణి సేన అనుకున్న విధంగా రాణించలేక పోయింది. ఆదిలోనే టాప్ ఆర్డర్ లోని కీలక ఆటగాళ్ల వికెట్లను చేజార్చుకుని అభిమానుల్లో కలవరం పెంచినా చివరి వరకూ పోరాడి డ్రా ముగించింది.
దీంతో మరో టెస్టు మ్యాచ్ మిగిలివుండగానే నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను ఆసీస్ 2-0 తేడాతో ఫలితం తేలిపోయింది. మంగళవారం ఐదో రోజు ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ధోనీ సేన 19 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ(54) మరోసారి ఆదుకున్నాడు. అతనికి జతగా అజ్యింకా రహానే(48) రాణించడంతో జట్టు క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడింది. విరాట్-రహానేల జోడి 85 పరుగుల జోడి నెలకొల్పి జట్టును ఆదుకున్నారు. టీమిండియా ఆటగాళ్లలో ఓపెనర్ శిఖర్ ధావన్ డకౌట్ గా పెవిలియన్ కు చేరగా, కేఎల్ రాహుల్(1), మురళీ విజయ్(11) పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు.
కర్ణాటక ఆటగాడు కేఎల్ రాహుల్ ఓపెనర్ గా పంపి టీమిండియా ప్రయోగం చేసింది. అయితే ఆ ప్రయోగం సత్ఫలితాన్ని ఇవ్వకపోవడంతో కాస్త నెమ్మదిగా ఆడింది. మ్యాచ్ గంటలోపు ముగుస్తుందనగా టీమిండియా పరుగు వ్యవధిలో రెండు వికెట్లను కోల్పోవడంతో మళ్ళీ పరిస్థితి మొదటికొచ్చింది. అయితే చివర్లో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (24), అశ్విన్ (8) జట్టుకు మరమ్మత్తులు చేపట్టి మ్యాచ్ డ్రాలో పాలుపంచుకున్నారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ జాన్సన్, ర్యాన్ హారిస్, హజ్లివుడ్ లకు తలో రెండు వికెట్లు దక్కాయి.
అంతకుముందు నాల్గవ రోజు సాధించిన ఒవర్ నైట్ స్కొరుతో అస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ను కొనసాగించి.. 9 వికెట్ల నష్టానికి 318 పరుగులు (డిక్లేర్డ్) చేసింది. మార్ష్ 99, రోజర్స్ 69, వార్నర్ 40, వాట్సన్ 17, స్మిత్ 14, హడిన్ 13, హర్రిస్ 21, జాన్సన్ 15, బర్న్స్ 9 పరుగులు చేశారు. లియాన్, హజ్లీవుడ్ నాటౌట్గా నిలిచారు. భారత బౌలర్లు ఉమేష్యాదవ్, షమీ, ఇషాంత్ శర్మ, అశ్విన్ తలో రెండు వికెట్లు తీశారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 530(ఆలౌట్), రెండో ఇన్నింగ్స్లో 318/9 (డిక్లేర్డ్). భారత్ తొలి ఇన్నింగ్స్లో 465 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ లో ఆరు విక్కెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more