గతంలో టీమిండియా జట్టులో ఒక సాధారణ ఆటగాడిగా రంగప్రవేశం చేసిన మహేంద్రసింగ్ ధోనీ.. ఆ తర్వాత తన బ్యాటింగ్ సత్తాతో జట్టుసారధిగా ఎన్నుకోబడిన విషయం తెలిసిందే! అలా ఎన్నుకోబడిన కొన్నాళ్లకే ఒక జట్టుకు కెప్టెన్ ఎలావుండాలో అందరికీ తనదైన శైలిలో పాఠాలు నేర్పించాడు కూడా! అంతవరకు బాగానే వుంది కానీ.. ఈమధ్య అతని ఇమేజ్ మరింతగా పెరిగిపోవడంతోబాటు నోటిదురుసు కూడా ఎక్కువైనట్లు తెలుస్తోంది. మొన్నటికిమొన్నే బిసిసిఐ బోర్డుకు వ్యతిరేకంగా తన అభిప్రాయాలు వెలిబుచ్చి నాలిక్కర్చుకున్న ధోనీ.. మరోసారి అటువంటి వ్యతిరేక వ్యాఖ్యలే చేసి అబద్ధాలకోరిగా పేరుతెచ్చుకున్నాడనే వార్తలొస్తున్నాయి.
2013 ఐపీఎల్ సీజన్-6లో భాగంగా జరిగిన ఫిక్సింగ్ ఎంతటి సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే! అందులో కొందరు క్రికెట్ ఆటగాళ్లతోపాటు ప్రముఖుల పేర్లు కూడా బయటికి వచ్చాయి. ఇతర వ్యవహారాలను కాస్త పక్కపెడితే... బిసిసిఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ అల్లుడు మయప్పన్ వ్యవహారం మాత్రం కాస్త వేడిగానే నడుస్తున్నట్లు కనిపిస్తోంది. మయప్పన్ కూడా ఫిక్సింగ్ లో పాల్పడ్డాడని ముద్గల్ కమిటీ తన నివేదికలో ఎప్పుడో పేర్కొంది కూడా! అతను బుకీలతో కలిసి ఫిక్సింగ్ కు పాల్పడ్డాడని సదరు కమిటీ సుప్రీంకు తన నివేదికలో వెల్లడించింది. అలాగే మయప్పన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రతినిధేనని స్పష్టం చేసింది కూడా!
ఈ విషయంలోనే జోక్యం చేసుకున్న ధోనీ.. కమిటీ ఇచ్చిన నివేదికకు వ్యతిరేకంగా అభిప్రాయాలు తెలిపి నాలిక్కర్చుకున్నాడు. ‘గురునాథ్ మయప్పన్ కు, చెన్నై సూపర్ కింగ్స్ కు ఎటువంటి సంబంధం లేదు. అతనో క్రికెట్ ఔత్సాహికుడు మాత్రమే’ అని శ్రీనివాసన్ ఇటీవలే మీడియాతో పేర్కొన్నారు. ఇప్పుడు ధోనీ కూడా శ్రీనివాసన్ లాగే మయప్పన్ కు మద్దతుగా అభిప్రాయాన్ని వెలిబుచ్చాడని సమాచారం! చెన్నై సూపర్ కింగ్ సారథిగా ముద్గల్ కమిటీ విచారణకు హాజరైన ధోనీ.. మయప్పన్ ను ‘క్రికెట్ ఔత్సాహికుడి’గా పేర్కొన్నాడని అంటున్నారు. అక్కడేమో ముద్గల్ కమిటీ తన నివేదికలో మయప్పన్ చెన్నైజట్టు ప్రతినిధేనని పేర్కొంటే.. ధోనీ మాత్రం వారికి వ్యతిరేకంగా కాదని తెలుపుతున్నాడు.
అంతేకాదు.. అతనితోపాటు, ఇతర చెన్నైజట్టు ప్రతినిధులు వాస్తవ విరుద్ధమైన వ్యాఖ్యలు చేసినట్లు కూడా కమిటీ నివేదికలో పేర్కొన్నారు. మరి ఒకవేళ మయప్పన్ చెన్నైజట్టు ప్రతినిధేనని సుప్రీంకోర్టు నిర్ధారిస్తూ ఆ జట్టు ఫ్రాంచైజీలపై చర్యలు తీసుకుంటే.. ధోనీ పరిస్థితి ఏంటని అనుకుంటున్నారు. మరి కోర్టు ఎలా స్పందిస్తుందో.. ఇందులో ధోనీకి ఎటువంటి సమస్యలు ఎదురవుతాయోనని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more