ప్రపంప దేశాలన్నింటిలోకెల్లా ఐసీసీలో అనధికార గుత్తాధిపత్యం చలాయిస్తున్న బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డులు ఇక పై పూర్తి అధికార పెత్తనం చలాయించడానికి సిద్దం అయ్యాయి. ఈ మూడు దేశాల బోర్డులు గుత్తాధిపత్యం కోసం వేసిన ఎత్తులకు ఐసీసీ బోర్డు ఏకగ్రీవ తీర్మానం చేసింది.భారత క్రికెట్ బోర్డు అభీష్ఠానికి అనుగుణంగా చాలా ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది.
దీంతో త్వరలో బీసీసీఐ అధ్యక్షుడిగా పదవి కాలం పూర్తి చేసుకోబోతున్న శ్రీనివాసన్ దీనికి కొత్త ఛైర్మెన్ గా పదవి భాద్యతలు చేపట్టబోతున్నాడు. మంగళవారం సుదీర్ఘంగా జరిగిన బోర్డు సమావేశంలో చాలా ప్రతిపాదనలకు ఏకగ్రీవ తీర్మానం లభించిందంటే ఈ మూడు దేశాల బోర్డులకు ఎంత ఆధిపత్యం ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఐసీసీ బోర్డు సమావేశంలో తీర్మానించిన అంశాలు :
ఐసీసీలో ఇక నుంచి బీసీసీఐ ప్రధాన నాయకత్వ బాధ్యతలు తీసుకుంటుంది. బీసీసీఐ, సీఏ, ఈసీబీ ఐదుగురు సభ్యులతో కొత్తగా ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఫైనాన్షియల్ కమిటీ, ఏర్పాటు చేసి, బోర్డులో ఎవరినైనా ఈ కమిటీకి నేత్రుత్వం వహించేవారిని ఎన్నుకోవచ్చు. అందులో భాగంగానే బీసీసీఐ ఛైర్మెన్ శ్రీనివాసన్ బాధ్యతలు చేపడతాడు.
-ఐసీసీలోని సభ్య దేశాలన్నింటికీ మెరిట్ ఆధారంగా అన్ని ఫార్మాట్లలో ఆడే వీలు కలుగుతుంది. సభ్యత్వ విషయంలో మార్పు ఉండదు.
- టెస్టు క్రికెట్ నిధిని కొత్తగా ఏర్పాటు చేస్తారు. దీంట్లో నుంచి బీసీసీఐ, ఆసీస్, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డులకు మినహా మిగిలిన అన్ని దేశాలకు వార్షిక పద్దతిన ఆదాయం సమానంగా పంపిణీ అవుతుంది.
- శాశ్వత సభ్య దేశాలు కాని బోర్డుల్లో అత్యున్నత ప్రదర్శన కనబరిచిన వాటికి ప్రోత్సాహకంగా అధిక ఆదాయాన్ని పంపిణీ చేస్తారు. నాలుగేళ్లలో మూడు ప్రధాన ఐసీసీ ఈవెంట్స్ జరుగుతాయి. దీంట్లో చాంపియన్స్ ట్రోఫీ కూడా ఉంటుంది. ముందుగా అనుకున్నట్లు టెస్టు చాంపియన్షిప్ ఆలోచన విరమించుకున్నారు.
- 2015 – 23 మధ్య రెండు దేశాల పరస్పర అంగీకారంతో ద్వైపాక్షిక సిరీస్ లు నిర్ణయించుకోవచ్చని తీర్మానించారు.
Knr
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more