న్యూజిలాండ్ పర్యటనకు ముందు భారత్ సౌతాఫ్రికా చేతిలో దెబ్బతిని వచ్చింది. ఒక్కడ ఒక్క సిరీస్ ని కూడా గెలవకుండా వచ్చిన ధోనీ సేన ఈసారి ఎలాగైనా సిరీస్ గెలవాలనే గట్టి పట్టుదలతో బయలు దేరింది. ప్రపంచ ఛాంపియన్లు కాబట్టి కివీస్ ఆటగాళ్ళు కూడా కాస్తంత భయపడ్డారు. తీరా అక్కడికి వెళ్లాక వారికి తెలిసిందేమిటంటే విదేశాల్లో వీరి ప్రదర్శన అంతంత మాత్రమే అని. మొదటి రెండు వన్డేల్లో విజయానికి దగ్గరగా వచ్చి ఓడిన టీం ఇండియా మూడో వన్డేలో గెలుపుకు ఒక్క పరుగు దూరంలో నిలిచి మ్యాచ్ ని టైగా ముగించి సిరీస్ పై ఆశలు నిలుపుకుంది.
ఇక నాలుగో వన్డేలో ఖచ్చితంగా గెలుస్తారనుకుంటే ఎలాంటి పోరాటం చేయకుండా ఓడిపోయి సిరీస్ ని కోల్పోయింది. హామిట్టన్ లో నేడు జరిగిన నాలుగో వన్డేలో ధోని సేన ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. సొంత గడ్డ పై న్యూజిలాండ్ కి ఇచ్చిన 279 పరుగుల విజయ లక్ష్యం పెద్ద కష్టం ఏం కాలేదు. మరో పదకొండు బంతులు మిగిలి ఉండగానే కేవలం మూడు వికెట్లు కోల్పోయి మాత్రమే ఛేదించింది. రాస్ టేలర్ (112 నాటౌట్) సెంచరీతో విజృంభించగా, విలియమ్సన్ (60) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
చివర్లో బ్రెండన్ మెకల్లమ్ (36 బంతుల్లో 49) దూకుడుగా ఆడి జట్టుకు విజయాన్నిఅ అందించారు. గత మూడు వన్డేల్లో బౌలింగ్ విభాగంలో అంత పెద్దగా రాణించిని బౌలర్లు ఈ మ్యాచ్ లో కూడా విఫలం అయ్యారు. వరుణ్ అరోన్, షమీ ఒక్కో వికెట్ తీయడం మినహా ఇతర బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు.
ఇప్పటి వరకు మూడు మ్యాచ్ ల్లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత యాభై ఓవర్లలో 278 పరుగులు ఐదు వికెట్లు కోల్పోయి చేసింది. కోహ్లీ (2), రహానే (3) నిరాశపరచగా, రోహిత్ శర్మ (79)తో పాటు తెలుగుతేజం అంబటి రాయుడు (37) రాణించాడు. చివర్లో ధోనీ (79 నాటౌట్), జడేజా (62 నాటౌట్) విలువైన భాగస్వామ్యం నెల కొల్పడంతో ఆ మాత్రం స్కోరు సాధించారు. కివీస్ బౌలర్లను ఎదుర్కోవడంలో కాస్తంత తడబడ్డారు. న్యూజిలాండ్ బౌలర్లు సౌధి రెండు, మిల్స్, బెన్నెట్, విలియమ్సన్ తలా వికెట్ తీశారు. న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన రాస్ టేలర్ కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more