సఫారీ గడ్డ పై భారత బ్యాట్స్ మెన్స్ నిలదొక్కుకోవడం కష్టమే అనుకున్నారు. ఏ మాత్రం అనుభవం లేని కుర్రాళ్ళ జట్టు నిలవడం కష్టమే అనుకున్నారు. వన్డేల్లో ఓడిపోయినా, టెస్టుల్లో మాత్రం తామేంటో నిరూపించుకుంటున్నారు. తొలిటెస్టులో సమర్థవంతంగా సఫారీ బౌలర్లను ఎదుర్కొన్న టీం ఇండియా టెస్టును డ్రా ముగించి తనలో ఆత్మవిశ్వాసం పెంచుకున్నారు.
అదే ఆత్మ విశ్వాసంతో రెండో టెస్టులో బరిలోకి దిగిన టీం ఇండియా రెండో టెస్టు మొదటి రోజు సఫారీ బౌలర్ల పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ఫేసర్లను సమర్థవంతగా ఎదుర్కొని తొలిరోజు ఆట ముగిసే సమయానికి 181 చేసి కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయింది. శిఖర్ ధావన్ (49 బంతుల్లో 29; 4 ఫోర్లు) విఫలమైనా... ఫామ్తో ఇబ్బందుపడుతున్న మురళీ విజయ్ (201 బంతుల్లో 91 బ్యాటింగ్; 17 ఫోర్లు) గాడిలో పడ్డాడు.
వాండరర్స్ సెంచరీ హీరో చతేశ్వర్ పుజారా (117 బంతుల్లో 58 బ్యాటింగ్; 7 ఫోర్లు)తో కలిసి భారత ఇన్నింగ్స్ను సాఫీగా నడిపించాడు. ఫలితంగా దక్షిణాఫ్రికాతో గురువారం ప్రారంభమైన రెండో టెస్టు తొలి రోజు టీమిండియా పూర్తి ఆధిపత్యం కనబర్చింది. విజయ్, పుజారా రెండో వికెట్కు అజేయంగా 140 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో ఉన్నారు. నేడు రెండో రోజు ఎలాంటి ఆటను ప్రదర్శించబోతున్నారో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more