ఇంగ్లాండ్ నాటింగ్ హాట్ లో జరుగుతున్న తొలి యాషెస్ టెస్ట్ సిరీస్ లో రెండో రోజు బౌలర్ల హవానే కొనసాగినా, చివరికి మాత్రం ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్స్ హవా సాగగడంతో మొదటి ఇన్నింగ్స్ లో ఆసీస్ కే 65 పరుగుల ఆధిక్యం దక్కింది. యాషెష్ లో రెండో రోజు 75 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ తొలి, రెండో సెక్షన్లలో టపటపా వికెట్లు కోల్పోయింది. ఆసీస్ కనీస ఆధిక్యం కూడా సాధించదు అనుకున్నారు. కానీ కెరీర్లో తొలి టెస్టు ఆడుతున్న ఆసీస్ ఆటగాడు ఎగర్ (101 బంతుల్లో 98; 12 ఫోర్లు, 2 సిక్స్లు), ఫిల్ హ్యూస్ (131 బంతుల్లో 81 నాటౌట్; 9 ఫోర్లు) పదో వికెట్కు 163 పరుగులు జోడించి ప్రపంచ రికార్డు సాధించడం ద్వారా పర్యాటక జట్టు పైచేయి సాధించింది. తొలి ఇన్నింగ్స్లో 280 పరుగులు చేసిన క్లార్క్సేన... ఇంగ్లండ్పై 65 పరుగుల ఆధిక్యం సాధించింది. ఎగర్ త్రుటిలో సెంచరీ కోల్పోయినా...11వ స్థానంలో బ్యాటింగ్కు దిగి అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్మన్గా కొత్త రికార్డు నెలకొల్పాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో పదో వికెట్కు ఎగర్, హ్యూస్లదే అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం. అనంతరం రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ తడబడింది. ఆరంభంలోనే రూట్ (5), ట్రాట్ (0)లను వరుస బంతుల్లో స్టార్క్ పెవిలియన్ పంపించడంతో 11 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ కుక్ (130 బంతుల్లో 37 బ్యాటింగ్; 4 ఫోర్లు), పీటర్సన్ (98 బంతుల్లో 35 బ్యాటింగ్; 6 ఫోర్లు) కలిసి ఇంగ్లండ్ పరిస్థితిని చక్కదిద్దారు. తొలి ఇన్నింగ్స్లో వెనుకబడిన 65 పరుగులను మినహాయిస్తే ప్రస్తుతం ఇంగ్లండ్ 15 పరుగులు ముందంజలో ఉంది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more