సిలికాన్ కప్ ముక్కోణపు సిరీస్ లో భాగంగా విండీస్ లో జరుగుతున్న ఈ సిరీస్ లో సొంత గడ్డ పై విండీస్ కు శ్రీలంక గట్టి షాక్ ని ఇచ్చింది. ట్రై సిరీస్ లీగ్ మ్యాచ్ లో భాగంగా మొన్న జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా నిన్నిటికి వాయిదా పడిన విషయం తెలిసిందే. మొన్న 19 ఓవర్ల మధ్యలో ఆపేసిన మ్యాచ్ ని నిన్న కొనసాగించారు. 19 ఓవర్ల 3 వికెట్ల నష్టానికి 60 పరుగులతో ఆట మొదలు పెట్టిన శ్రీలంక 41 ఓవర్లలో 219 పరుగులు చేసింది. డక్ వర్త్ లూయీస్ పద్దతి ప్రకారం విండీస్ లక్ష్యాన్ని 41 ఓవర్లలో 230 పరుగుల నిర్ణయించారు. 230 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్ జట్టుకు ఆదిలోనే ఎదురెబ్బ తగిలింది. ఓపెనర్లు క్రిస్ గేల్, చార్లెస్ వికెట్లను ఆరంభంలోనే కోల్పోవడంతో పరుగుల వేగం మందగించింది. లక్ష్య ఛేదనలో పరుగుల వేగాన్ని పెంచే క్రమంలో 31 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయింది. కాని మిడిల్ ఆర్డర్ లో బ్రావో (70), సిమన్స్ (67) పరుగులతో వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఆతర్వాత బ్రావో, చార్లెస్ వికెట్లు వెంట వెంటనే కోల్పోవడంతో విండీస్ పరాజయం బాటలోనే నడిచింది. చివరకు 41 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులకే పరిమితమవ్వడంతో 39 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 60 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన లంకను సంగక్కర చివరి వరకు నిలిచి 90 పరుగుల చేసి ఆదుకున్నాడు. శ్రీలంక జట్టులో మ్యాథ్యూస్ 4, ఎర్రంగ 3, మలింగ 2 వికెట్లు పడగొట్టారు. శ్రీలంక విజయంలో కీలక పాత్ర పోషించిన సంగక్కరకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more