భారత్ - ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ లో భాగంగా ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ లో ఇన్నింగ్స్ 135 పరుగుల తేడాతో కంగారులను ధోని సేన చిత్తు చేసింది. మొదటి ఇన్నింగ్స్ లో భారత్ ఇచ్చిన ఆధిక్యాన్ని ఛేదించేందుకు నిన్న సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా మూడో రోజు రెండు వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన రెండు గంటల్లోనే ఎనిమిది వికెట్లు కోల్పోయి చావుదెబ్బ తింది. భారత స్నిన్నర్లు విజృంభించడంతో కంగారులు పెవిలియన్ బాట పట్టారు. రెండో ఇన్నింగ్స్లో 131 పరుగులకే ఆసిస్ కుప్పకూలింది. నాలుగు టెస్టుల సిరీస్లో భారత్ 2-0 ఆధిక్యంలో ఉంది. ఇక టెస్ట్ల్లో 22వ విజయం నమోదు చేసి ధోనీ కెప్టెన్గా రికార్డు సృష్టించాడు. జడేజా, అశ్విన్ స్పిన్ దాటికి కంగారులు విలవిలలాడి పోయారు. ఇక ఈ టెస్టులో డబుల్ సెంచరీ చేసిన పుజారాకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. టీమిండియా విజయంతో అభిమానులు సంబరాలు చేసుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more