కనుమ పండుగవేళ క్రికెట్ అభిమానులకు హోరా హోరీ క్రికెట్ పోరును రంజు రంజుగా ఆస్వాదిస్తున్నారు. కొచ్చి లోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఇవాళ భారత్, ఇంగ్లండ్ల మధ్య రెండో వన్డే షురూ అయింది. ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి వన్డేలో ఇంగ్లండ్ చేతిలో ఓడిన టీమిండియా ఈ మ్యాచ్ లో గెలుపు కోసం సరికొత్త ప్లాన్స్ తో ముందుకు సాగుతోంది.
ఇదిలా ఉంటే, అయిదు వన్డేల సిరీస్లో మొదటి రెండు మ్యాచ్లు సమర్పించుకుంటే ఆ తర్వాత ప్రతి మ్యాచ్లో చావోరేవో అన్నట్టు పోరాడాలి. కాబట్టి రెండో వన్డే ధోనీ సేనకు కీలకం. సిరీస్ గెలిచి కనీసం వన్డేల్లో అయినా పరువు దక్కించుకోవాలంటే టీమిండియా కొచ్చిలో గెలవాలి. సొంతగడ్డపై ఇలాంటి స్థితిలో ఆడటం కచ్చితంగా ఒత్తిడితో కూడుకున్న అంశమే.
మరోవైపు తొలివన్డేలో విజయం సాధించిన ఇంగ్లండ్ జట్టు అదే ఊపుతో రెండో వన్డేలోనూ గెలుపుపై ధీమాగా ఉంది. దీనికి ధీటుగా ధోనీ సేన మ్యాచ్ ని ఎలాగైనా సొంతం చేసుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తోంది.
కాగా, తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 285 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ ధోని, రైనా, జడేజాలు చెలరేగి ఆడటంతో భారత్ భారీ స్కోరును సాధించింది. ధోని 72, జడేజా 61, రైనా 55, కోహ్లీ 37, యువరాజ్ 32 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఫిన్, డెర్న్ బాచ్ రెండేసి వికెట్లు, వోక్స్, ట్రెడ్ వెల్ చెరో వికెట్ పడగొట్టారు. భారత బ్యాట్స్ మెన్ ప్రతాపంతో స్టేడియంలో భారత్ బ్యాటింగ్ చేస్తున్నంత సేపూ స్టేడియంలో కోలాహల వాతావరణం వెల్లివిరిసింది.
...avnk
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more